చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్ కదాస్ విశ్వక్సేన్, దర్శకుడు సందీప్రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ హీరో నవదీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వాయిలెన్స్ ఎక్కువ అని అర్థమైంది. ఈ సీస్పెస్ అనే సంస్థతో నిర్మాతగా టాలెంట్ యంగ్ పీపుల్కు నవదీప్ మంచి ఫ్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన తరువాత అందరూ ఆ సినిమాలోని చాలా తక్కువ మందితో టచ్లో వుంటారు. ఇక నేను నటించి రెస్పెక్ట్ చేసే వాళ్లలో చాందిని చౌదరి ఒకరు. టెన్షన్ పడే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందిని కి ఆ భయం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత దర్శకురాలు, ఫీమేల్ ఎడిటర్, ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాలనేది నా కోరిక. ఈ టీమ్ను చూస్తుంటే ముచ్చటేసింది. తప్పకుండా ఈ చిత్రం అందరికి మంచి బ్రేక్నివ్వాలి అన్నారు.
చాందిని చౌదరి మాట్లాడుతూ ఈ సంవత్సరం నా సినిమాలు వరుసగా వస్తాయని ఊహించలేదు. అన్ని సినిమాలు అనుకోకుండా ఒకేసారి విడుదల అవుతున్నాయి. నా ఇన్నేళ్ల కృషి ఇప్పుడు ఫలితం చూపిస్తుంది. నా లైఫ్లో మెమెరబుల్ సినిమాను ఇచ్చిన సందీప్ రాజ్ నా కోయాక్టర్ విశ్వక్సేన్కు థ్యాంక్స్. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎదరుచూస్తున్న తరుణంలో ఈ సినిమా వచ్చింది. పోలీస్ పాత్ర అనగానే యాక్షన్ ఓరియెంటెడ్గా నా పాత్ర వుంటుందని అనుకున్నాను. అయితే యాక్షన్తో పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో వున్నాయి. తప్పకుండా యేవమ్ అందర్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.
సందీప్రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. ఇప్పటి వరకు చాలా థ్రిల్లర్లు చూసి వుంటాం. అందులో ఇది చాలా డిఫరెంట్గా వుంటుంది. నాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ వుంటాయి. ఈ సినిమాలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. ఈ సినిమాకు టెక్నికల్గా అన్ని బాగా కుదిరాయి. సినిమాలో అన్ని ఎమోషన్స్, వెరియేషన్స్ వున్నాయి. చాలా మంచి సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. ప్రతి చిన్న సినిమాకు విశ్వక్ సపోర్ట్ వుంటుంది. ఈ సినిమాకు కూడా ఆయన ప్రోత్సాహం అందించడం ఆనందంగా వుంది అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ కంటెంట్ బెస్డ్ సినిమాలకు విశ్వక్సేన్ లాంటి హీరోలు ప్రమోషన్ విషయలో సపోర్ట్ వుంటుంది. ఈ విషయంలో విశ్వక్ సూపర్స్టార్ లాంటి వాడు. మంచి ఇంటెన్స్తో నిజాయితీగా చేసిన సినిమా ఇది. సినిమా మీద పిచ్చి తపన వున్న హీరోయిన్ చాందిని చౌదరి, ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంది. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు, వైవిధ్యమైన పాత్రల కోసం తపన పడుతుంది.తప్పకుండా ఈ చిత్రం చాందిని కెరీర్లో దిబెస్ట్గా వుండాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ నా కథను, నా పాత్రను నమ్మి ఈ సినిమా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విషయంలో నవదీప్ సపోర్ట్ వుంది. ప్రతి విషయంలో ఆయన నాతో వున్నాడు. ఈ సినిమా చూసి సందీప్రాజ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాలో ధైర్యాన్ని నింపింది. కీర్తన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెటర్ అవుట్పుట్ ఇచ్చారు. అందరి సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. తప్పకుండా అందరికి నచ్చుతుందే నమ్మకం వుంది అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…