యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలకు రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ముందుగా మీ గురించి చెప్పండి?
-మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబై వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్ సినిమా చేశాను. ఇది తెలుగులో నా మొదటి సినిమా.
ఈ సినిమాలో మీరు బాలకృష్ణ గారి అభిమానిగా కనిపిస్తారు కదా.. మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి, అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా వుంటుంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ విమన్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
-బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన చాలా సరదా వుంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరి ని చాలా ఎంజాయ్ చేశాను.
డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి ?
-రవికుమార్ గారు చాలా మంచి విజన్ వున్న డైరెక్టర్. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
‘తిరగబడరసామీ’ లో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఇలా ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారికి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.
నిర్మాత మల్కాపురం శివకుమార్ గురించి ?
-శివ గారు వెరీ నైస్ పర్శన్. ఫ్యామిలీ పర్శన్ లా వుంటారు. వాళ్ళ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసినందుకు ఆయనకి రుణపడి వుంటాను.
హీరో రాజ్ తరుణ్ గురించి ?
-రాజ్ తరుణ్ చాలా నైస్ పర్శన్. సెట్స్ లో చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్.
జెబి మ్యూజిక్ గురించి ?
-చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపధ్య సంగీతం కూడా సీన్స్ ని ఎలివేట్ చేస్తోంది.
మకరంద్ దేశ్ పాండే గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ?
-ఆయన గ్రేట్ యాక్టర్. చాలా వినయంగా వుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
తెలుగు సినిమాలు చూస్తుంటారా? ఎవరి సినిమాలో పార్ట్ అవ్వాలని కోరుకుంటారు ?
-చూస్తాను. బొమ్మరిల్లి, ఏం మాయ చేశావా నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా బేబీ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల. అలాగే మణిరత్నం సార్ తో కూడా కలసి పని చేయాలని వుంది.
టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ?
-అందరు హీరోలు ఇష్టమే. అయితే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా యాక్టర్ కళ్ళలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే .. నాని గారి పేరు చెప్తాను. తన కళ్ళతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించే యాక్టర్ తను. తనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు అంటే ఇష్టం.
ఎలాంటి సినిమాలు చేయాలనీ కోరుకుంటారు ?
-అన్ని జోనర్స్ ఇష్టమే. అయితే కథలో ప్రాధాన్యత వున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.
తెలుగులో కొత్త సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ?
-కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలోనే ఫైనల్ అవుతాయి.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…