టంపాలో జరిగిన NATS 2025 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన రాకతో అదొక చరిత్రలా మారిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఖండాలు, భాషలు, సంస్కృతులలో, సరి హద్దుల్ని దాటుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ కాదు.. ప్రతీ కుటుంబంలోని ఓ వ్యక్తి.. తెలుగు వారి గుర్తింపు.. తెలుగు వారి గర్వం.
NATS 2025 కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇదొక ఎమోషనల్ ఈవెంట్గా సాగింది. తెలుగు వారి ప్రైడ్గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది. ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, ప్రేమించబడే, అనుసరించే తెలుగు నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విజయానికి చిహ్నంగా, తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు.
విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు NATSలో అల్లు అర్జున్ను చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు. వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం. జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తమ హృదయాలలో తెలుగు స్ఫూర్తిని కలిగి ఉంటారని గుర్తుచేసిన క్షణం ఇది.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…