NATS 2025 ద్వారా తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Must Read

టంపాలో జరిగిన NATS 2025 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన రాకతో అదొక చరిత్రలా మారిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఖండాలు, భాషలు, సంస్కృతులలో, సరి హద్దుల్ని దాటుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ కాదు.. ప్రతీ కుటుంబంలోని ఓ వ్యక్తి.. తెలుగు వారి గుర్తింపు.. తెలుగు వారి గర్వం.

NATS 2025 కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇదొక ఎమోషనల్ ఈవెంట్‌గా సాగింది. తెలుగు వారి ప్రైడ్‌గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది. ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, ప్రేమించబడే, అనుసరించే తెలుగు నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విజయానికి చిహ్నంగా, తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు.

విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు NATSలో అల్లు అర్జున్‌ను చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు. వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం. జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తమ హృదయాలలో తెలుగు స్ఫూర్తిని కలిగి ఉంటారని గుర్తుచేసిన క్షణం ఇది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News