యాక్టింగ్ మీద ప్యాషన్ తో మళ్లీ టాలీవుడ్ కు రావాలనుకుంటున్నా – నటి ప్రశాంతి హారతి

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి చెప్పారు.

  • మా కుటుంబం విశాఖలో ఉండేవాళ్లం. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. మా ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాతావరణం ఉండేది. సినిమాలు చూసేందుకు నన్నూ పంపేవారు కాదు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ గారు నిర్మించిన రూపాయి అనే చిత్రంలో నటించాను. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా ముంబై వెళ్లాను. ఆ తర్వాత ఇంద్ర సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. అలా నా కెరీర్ కొనసాగింది.
  • పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చాను. అక్కడి పిల్లలకు తెలుగు తెలియదు. క్లాసికల్ డ్యాన్స్ పాటల్లోని అర్థాలను ఇంగ్లీష్ లో వివరించి చెప్పేవాళ్లం. అప్పుడు వారికి అర్థమై నేర్చుకునేవారు. మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. మా పాప తాన్యతో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. తెలుగింటి సంస్కృతికి మంచి రెస్పాన్స్ దక్కడం సంతోషాన్ని కలిగించింది. మా పాప తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు. తన ఏజ్ కు తగిన మంచి అవకాశం వస్తే పాప తాన్యను కూడా సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు.
  • నేను యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలేదు. అయితే క్లాసికల్ డ్యాన్సర్ ను కాబట్టి నటిగా తెలియకుండానే పరిణితి ఏర్పడింది. నవ్వడం, ఏడ్వడం వంటి భావోద్వేగాలు ఇలా చెబితే అలా చేసేసేవాళ్లం. దానికి ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండేది. ఈ ఆత్మవిశ్వాసంతోనే సినిమాలు, సీరియల్స్ చేశాను. అప్పట్లో మీడియా ప్రభావం ఇంత ఉండేది కాదు. చేస్తే సినిమాలు లేకుంటే సీరియల్స్. ఓటీటీలు లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ తో ఔత్సాహిక నటీనటులకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్ కు రావాలి అనిపించింది. నటిగా నాకున్న ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నాను.
  • మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి..ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నా. నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే బెంగళూరు చెన్నై వెళ్లి వస్తుంటా.
  • ఒకప్పటితో చూస్తే మూవీ కంటెంట్ లో చాలా కొత్తదనం వచ్చింది. వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇన్నోవేటివ్ గా ఉంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ లు పెరిగాయి. మహానటి లాంటి గొప్ప బయోపిక్ లు వచ్చాయి. మేము ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు చూసి మంజు భార్గవి, భాను ప్రియలా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇన్స్ పైర్ అయ్యాం. మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్స్ పైర్ చేసే మూవీస్, సిరీస్ లు ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago