‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్‌గా అనిపించే యూత్‌ఫుల్‌ చిత్రం టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. కాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ ” నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ”హుషారు పిట్టలు’ సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్‌ యంగ్‌స్టర్‌ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు.

హీరో అన్షు మాట్లాడుతూ ” అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో మాసినపల్లి రవి పాత్ర చేశాను. టీజర్‌ లాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయమైనందుకు సంతోషంగా ఉంది. తప్పకుండా హిట్‌ కొడతాం’ అన్నారు.

హీరోయిన్‌ వాసవి గణేషన్‌ మాట్లాడుతూ ” టీజర్‌కు మంచి సినిమా ఉంటుంది. నాకు తొలిసినిమా. నా పాత్ర తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు.

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ” 16 సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ ఏషియన్‌ ఫిలింస్‌ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా గురించి ఏమీ తెలియని నేను అన్ని నేర్చుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది. నా రియల్‌లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్‌ అయ్యి షాక్‌ అయ్యి ఔట్‌ అవుతారు’ అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణగోపాల్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాను సైలెంట్‌గా కంప్లీట్‌ చేసి ఈ సినిమా నాకు చూపించారు. సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూడగానే నాకు షాకింగ్‌గా అనిపించింది. ఫస్టాఫ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో వెళ్లిన సెకండాఫ్‌లో ఓ మెచ్యూర్డ్‌ కంటెంట్‌ ఉంది. ఇది డెఫినెండ్‌గా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా యూత్‌కు, తల్లిదండ్రులకు దర్శకుడు ఏదో విషయం చెబుతున్నాడు. ఈసినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్సబుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాడు. ఆర్టిస్టులు కూడా ఎంతో నేచురాల్‌గా ఉంటుంది. సినిమా మీద పాషన్‌ ఉన్న దర్శకుడు సురేష్‌ ప్రొడక్షన్ష్‌ సురేష్‌బాబు, జగదీష్‌గారికి నచ్చింది అందుకే వాళ్లు రిలీజ్‌చేస్తున్నారు. మంచి సినిమా కాబట్టి నేను కూడా సపోర్ట్‌ చేస్తున్నాను. కంటెంట్‌ నచ్చితే సురేష్‌బాబు సపోర్ట్‌చేయడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా’ అన్నారు.

నిర్మాత కె.వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాను ఎంతో ఇష్టపడి తీశాను. ఏడు సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఈ సినిమా నిర్మించాను. ఈ సినిమా లైన్‌ను నచ్చి ఈ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో అందరూ ప్రతిభ గల వారు. అందరూ ఈ సినిమాను సొంత సినిమాలా భావించి నిర్మించారు. నిజాయితీగా ఉంటే సక్సెస్‌ వస్తుందనే నమ్మకం నాకుంది. చాలా మంది తల్లిదండ్రులకు, యూత్‌కు ఈ సినిమాలో మేసేజ్‌ ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో తీశాం. మీ అందరిని సినిమా అలరిస్తుంది’ అన్నారు.

చిన్ని చరణ్‌ మాట్లాడుతూ ” హుషారు పిట్టలు సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా విడుదల చేయడం హ్యపీగా ఉంది. భవిష్యత్‌లో ఈ చిత్ర దర్శకుడు బిక్షు పెద్ద దర్శకుడు అవుతాడు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. యూత్‌ ఈ సినిమా చూసి ఉర్రూతలూగుతారు. నేను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఇది. హుషారు పిట్టలు సినిమా నన్ను మాస్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలబెడుతుంది’ అన్నారు.

అన్షు, వాసవి గణేషన్‌, గోవర్థన్‌, సునీత్‌ మనోహర్‌, రమేష్‌, బలగం బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌-అర్జున్‌

TFJA

Recent Posts

హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

20 hours ago

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

20 hours ago

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

2 days ago

’మిషన్ సి -1000‘’ – గ్రాండ్ రిలీజ్ మార్చి 6.

ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు…

2 days ago

సినిమా పేరే ‘రేపు ఉదయం 10 గంటలకు’… :ఫస్ట్ లుక్ విడుదల

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు…

2 days ago

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

2 days ago