శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం అక్టోబర్ 25న విడుదలై మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆడియెన్స్కు థాంక్స్ చెప్పేందుకు సోమవారం నాడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత బాగా రివ్యూలు వస్తాయని, ఆడియెన్స్ ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు. ఇంకా చూడని వాళ్లంతా చూసి మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఆడియెన్స్ సైతం మా సినిమాను ప్రశంసిస్తున్నారు. మాలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం. మా సినిమాను ఇంకా చూడని వాళ్లు థియేటర్కి వెళ్లి చూడండి’ అని అన్నారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…