పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైన”ఔను..నేనింతే”

యం.ఏ.సత్తార్ సమర్పణలో శ్రీ సత్య విధుర మూవీస్ పతాకంపై రామ్ కార్తీక్, ప్రిష జంటగా డి. వి. కె నాగేశ్వరరావు దర్శకత్వంలో జి. వి. చౌదరి, నాగరాజు చిర్రా సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ” ఔను.. నేనింతే!!” ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి .ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు పృద్వి , అనీష్ కురువెళ్ల, రఘు కుంచె విచ్చేసారు..పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటులు పృద్వి క్లాప్ కొట్టగా, నటుడు అనీష్ కురువెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేసారు.చిత్ర సమర్పకులు యం ఏ. సత్తార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో …

చిత్ర నిర్మాతలు జి. వి చౌదరి, నాగరాజు చిర్రా లు మాట్లాడుతూ.. ఇది నా రెండవ సినిమా. నా మొదటి చిత్రం “నీ జతలేక”..ఆ సినిమా తరువాత తీస్తున్న సినిమానే “ఔను.. నేనింతే”. దర్శకుడు నాగేశ్వరరావు చెప్పిన కథ నచ్చడంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము..ప్రతి ఒక్కరూ ఆలోచింప జేసే విదంగా తెరకేక్కుతున్న మా చిత్రానికి చక్కటి నటీ, నటులు టెక్నిషియన్స్ కుదిరారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ ప్రిష ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాము. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇదొక యాంటీ లవ్ స్టోరీ. రివర్స్ స్క్రీన్ ప్లే తో రాసుకున్న కథ. క్షణ క్షణం అడ్వాన్స్ అయిపోతున్న ప్రస్తుత ట్రెండ్ లో యూత్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా చేసే పనుల వలన వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా అండర్ కరెంట్ మెసేజ్ ఇస్తూ అవుట్ & అవుట్ కామెడీ తో తెలియజేస్తున్నాము.ప్రతి తల్లి, తండ్రి కూడా పిల్లలతో కలసి చూసే విధంగా తెరకెక్కుతున్న .ఔను.. నేనింతే!సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటులు పృద్వి మాట్లాడుతూ.. యూత్ & పేరెంట్స్ కు కూడా మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఈ సినిమాలో నేను అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను అందరూ ఆదరించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె మాట్లాడుతూ.. మంచి లవ్ స్టోరీ తో పాటు ఇందులో చాలా ఏమోషన్స్ కూడా వున్నాయి.ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు చాలా చక్కగా కుదిరాయి. ఇవన్నీ కూడా కూడా స్విచ్ వేషన్ తగ్గట్టు ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను ఎనిమిది సినిమాలు చేశాను. దర్శకులు నాగేశ్వరరావు గారు చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను.ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మా నిర్మాతలు జి. వి చౌదరి, నాగరాజు చిర్రా లు సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ అలవలపాటి శేఖర్ మాట్లాడుతూ.. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు హీరో, హీరోయిన్ లు, టెక్నిషియన్స్ చాలా బాగా సెట్టయ్యారు. సినిమాకు తగ్గట్టే రఘు కుంచె గారు చక్కటి పాటలు అందిస్తున్నారు. మంచి టీం మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ ప్రిష మాట్లాడుతూ..ఇది నా మొదటి చిత్రం మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములున్నారు

నటీ, నటులు;

రామ్ కార్తీక్, ప్రిష ,పృద్వి, అనీష్ కురువెళ్ల, సన, చమ్మక్ చంద్ర, రైజింగ్ రాజు, అనంత్, అభి, లిరీష , సుజాత,విజయ్ భాస్కర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : యం ఏ.సత్తార్
బ్యానర్ : శ్రీ సత్య విధుర మూవీస్
నిర్మాత : జి. వి చౌదరి, నాగరాజు చిర్రా

కథ. కథనం, మాటలు,దర్శకత్వం : డి. వి. కె. నాగేశ్వరరావు

మ్యూజిక్ : రఘు కుంచె
సినిమాటోగ్రాఫర్ :: శివా రెడ్డి సవనం
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
డ్యాన్స్ మాస్టర్స్ : ప్రేమ్ రక్షిత్, నిక్సన్
కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు
ఫైట్స్ : నందు, రాజు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అలవలపాటి శేఖర్
లైన్ ప్రొడ్యూసర్ : కోన రమేష్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Tfja Team

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

1 day ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

1 day ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago