రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘నా పేరు రామ్. అలియాస్ యేసు. గొర్రె జైల్లో వుండటం ఏందీ, ఆడికెల్లి తప్పించుకోవడం ఏందీ ? ఇదంతా మీకు వింతగా వుంది కదా’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.
ఒక గొర్రె ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చుపెట్టిన నేపధ్యాన్ని ట్రైలర్ లో చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. గొర్రె వలన జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా వున్నారు.
సుహాస్ ఖైదీ క్యారెక్టర్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ‘మనం బ్రకతకం కోసం వాటిని చంపేయొచ్చు. మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మ రక్షణే కదా’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది.
సుహాస్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ లో అదరగొట్టారు. పోసాని కృష్ణ మురళి, రఘు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు బాబీ ఓ యూనిక్ పాయింట్ ని చాలా బ్రిలియంట్ గా ప్రజెంట్ చేశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
పవన్ సిహెచ్ నేపధ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది.సురేష్ సారంగం కెమరాపనితనం హైలెట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న గ్రాండ్ గా విడుదల అవుతుంది.
తారాగణం: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులు
సాంకేతిక సిబ్బంది
దర్శకత్వం: బాబీ
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి
సంగీతం: పవన్ సిహెచ్
కెమెరామెన్ : సురేష్ సారంగం
ఎడిటర్ : వంశీ కృష్ణ రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రామ్ ప్రసాద్ రవి
పీఆర్వో: వంశీ శేఖర్
సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వంటి ప్రాజెక్టులను రూపొందించే ప్రతి నిర్మాత, దర్శకుడు, మూవీ ప్రొఫెషనల్కు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో,…
రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ…
ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా…
వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే…