ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోన్న ‘గాండీవధారి అర్జున’..సమాజంపై మంచి ఆలోచన రావాలనే ఉద్దేశంతో చేసిన సినిమా – ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గాండీవధారి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ….
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘నాకు హాలీడే అన్నా, పండుగ అన్నా కూడా మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజే. ఆయనకు అభిమానులందరి తరుపునా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ఫస్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, నా చివరి దర్శకుడు అనిల్ రావిపూడి గారు,నా ప్రజెంట్ డైరెక్టర్ ఇదే స్టేజ్ మీదున్నారు. నన్ను నటుడిగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. వెరైటీ సినిమాలు తీసిన ప్రతీ సారి కమర్షియల్ సినిమాలు తీసుకోవచ్చు కదా? అని సలహాలు ఇస్తుండేవారు. కానీ కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. సినిమా హిట్టైనా ఫ్లాపైనా నా ప్రయత్నం ఆగదు. ఆడియెన్స్ సపోర్ట్ ఇంకా ఇలాంటి కొత్త కథలు చేస్తూనే ఉంటాను. సోషల్ మెసెజ్ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాలోని కోర్ పాయింట్ వల్లే ఒప్పుకున్నాను. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనల రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. నిన్న రాత్రే ఈ సినిమాను చూశాను. మంచి సినిమా తీశామనే ఫీలింగ్ వచ్చింది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత తొలిప్రేమతో నాకు మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. విరూపాక్షతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాను తీశారు. టీం అంతా కూడా కష్టపడి పని చేసింది. నా మాటలు కాదు.. నా సినిమా, నా పని మాట్లాడాలి. ఆగస్ట్ 25న థియేటర్లోకి సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు చాలా జానర్లు టచ్ చేశాయి. చందమామకథలు, గరుడవేగ చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎమోషన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను తీశాను. గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఎమోషన్ను జోడించి ఎంటర్టైనింగ్ యాక్షన్ జోనర్లో తీశాను. ఈ కథ రాయడం ఈజీగానే ఉంటుంది. కానీ ఇలాంటి కథను చేసే హీరో కావాలి. ఇది హీరో బేస్డ్ కథ కాదు. కథలో ఓ భాగంగా హీరో ఉంటాడు. కథ బాగుంది.. కథలో తన పాత్ర బాగుంటే.. సినిమాలు చేసే హీరో వరుణ్.
అందుకే ఈ కథను ఆయనకు చెప్పాను. ఆడియెన్స్కు ఎక్కడా లోటు లేకుండా బడ్జెట్ పరిమితులతో తీయాలి. ఈ ఒత్తిడిలో 72 రోజుల షూటింగ్ను టీం అంతా కలిసి కష్టపడి 54 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. హీరో డెడికేషన్ వల్లే అది సాధ్యమైంది. దెబ్బలు తగిలినా కూడా షూటింగ్ చేశాడు. వరుణ్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఈ సినిమాను మనసుతో చేశాను. నా మనసుకు నచ్చిన సినిమా. ఆగస్ట్ 25న ఈ చిత్రం రాబోతోంది. మా అందరినీ ఆడియెన్స్ ఆశీర్వదించాల’ని కోరుకున్నాను.
చి్త్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్తో మేం ఇది వరకు చేసిన తొలి ప్రేమ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మా ట్రైలర్ను రిలీజ్ చేసిన చరణ్ బాబుకు థాంక్స్’ అని అన్నారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు గారిని, నేను హీరోగా పరిచయం చేసిన వరుణ్ తేజ్ను ఇలా ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త సబ్జెక్టులను ఎంచుకుంటూ ఉంటాడు. ఈ సినిమా కోసం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ మేకింగ్, మిక్కీ సౌండ్ అద్భుతంగా ఉంది. విరూపాక్షతో ఈ బ్యానర్ ఆల్రెడీ హిట్ కొట్టింది. బాపీకి మరో హిట్ రాబోతోంది. ఫిదా, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మా బ్యానర్లో వరుణ్ చేశాడు. ఈ సినిమాను ఆడియెన్స్ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.
అనిర్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పెద్ద హిట్ అయి టీం అందరికీ మంచి పేరు రావాలి. ప్రవీణ్ సత్తారు అన్ని రకాల జానర్లను టచ్ చేస్తుంటారు. సాక్షి వైద్యకు ఆల్ ది బెస్ట్. బాపీగారు, భోగవల్లి ప్రసాద్ గారు నా మొదటి సినిమా నుంచి పరిచయం. వారిద్దరికీ ఆల్రెడీ ఓ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి. నా బ్రదర్ లాంటి వాడు వరుణ్. ప్రతీ ఫిల్మ్ కొత్తగా ఉండాలని చూస్తుంటాడు. కొత్త కథలు ఎంచుకుంటూ ఉంటాడు. వరుణ్ ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నాలో ఐరా పాత్రను చూసి ఛాన్స్ ఇచ్చిన ప్రవీణ్ గారికి థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడటం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. వరుణ్ తేజ్ గారు మంచి స్క్రిప్ట్లను ఎంచుకుంటూ ఉంటారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న సమస్యల మీద వచ్చిన ఈ స్క్రిప్ట్ను ఎంచుకున్నారు. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…