యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రయేషన్స్ పతాకం పై ఈశ్వర్ నయన సర్వార్ హీరో హీరోయిన్స్ గా అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజా ఐటమ్ సాంగ్ లో చేస్తున్న చిత్రం “సూర్యాపేట్ జంక్షన్” . చిత్ర యూనిట్ ఈ సినిమా లోని మూడవ సాంగ్ నీ సౌత్ ఇండియ స్టార్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిధి
సి.కళ్యాణ్ మాట్లాడుతూ… “చెంగు చెంగు అంటూ సాయిచరణ్ పాడిన టీజింగ్ సాంగ్ చాలా బాగుంది హీరో ఈశ్వర్, హీరోయిన్ నయన సర్వార్ ఈ పాటకు డాన్స్ బాగా చేశారు. డైరెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా స్టోరీ ఎంచుకుని చాలా బాగా తీశారు కొరియోగరాఫర్ ఈశ్వర్ చేత డాన్స్ స్టెప్స్ బాగా చేయించాడు . రోషన్ సాలూరి మ్యూజిక్ కూడా బాగుంది అని చెప్తూ మా ఈశ్వర్ కి ఈ చిత్రం తో మంచి హిట్ రావాలి అని కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియచేసారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ….. సూర్యాపెట్ జంక్షన్ లోని రెండవ పాటని సి. కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం ఆనందంగా ఉంది. ఆయన బిజీ టైమ్ లో కూడా అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేయడానికి ఒప్పుకుని మూవీ కంటెంట్ చూసి సూర్యాపెట్ జంక్షన్ మంచి సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారన్నారు. మూడవ సాంగ్ విడుదల చేసినందుకు మా టీమ్ తరపున నా తరపున కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు .
డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ….. ఇప్పటికే టీజర్ ఐటమ్ సాంగ్ విడుదలయ్యి వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. హీరో ఈశ్వర్ హీరోయిన్ని టీజింగ్ చేసే ఈ మాస్ సాంగ్ అందరికీ నచ్చుతుందిఅన్నారు.
రచయిత రాజేంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ….. వ్యవస్తను సరిదిద్దే బాధ్యత యువత పై ఉంటుంది, కొత్తతరం ఓటరులు తప్పకుండా చూడవలిసిన చిత్రం ‘సూర్యాపెట్ జంక్షన్’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ….. మా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము మిగిలిన అప్డేట్స్ త్వరలో తెలియజేస్తాము అన్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
నటీనటులు
ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్, బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు,
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్ : సూర్యాపేట జంక్షన్
నిర్మాతలు : అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్.శ్రీనివాసరావు,
డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్
స్టోరీ : ఈశ్వర్
మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్ : శ్రీనివాస్
లిరిక్స్ : ఎ.రహమాన్
పోస్టర్ డిజైనర్ : ధనియేలె
రైటర్స్ : రాజేంద్ర భరద్వాజ్ , సత్య రిషి
పి. ఆర్. ఓ : కడలి రాంబాబు
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…