FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ – 10 లక్షల ప్రైజ్ మనీ

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, హైదరాబాద్ – ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 20, 2024
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) మరియు తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (TSTA) సహకారంతో FNCC ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇది టెన్నిస్ మరియు క్రీడాస్ఫూర్తి యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది. FNCC కి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను FNCC నిర్వహించడం ఇదే మొదటిసారి.


హీరో నాగ శౌర్య, అర్జున్ అవార్డు గ్రహీత సాకేత్ మైనేని గౌరవనీయ ప్రముఖులతో కలిసి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. FNCC క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ జి ఆది శేషగిరిరావు గారు, శ్రీ చాముండేశ్వరి నాథ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ FNCC మరియు సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ శ్రీ V.V.S.S పెద్ది రాజు, మరియు కమిటీ సభ్యులు శ్రీ కాజా సూర్యనారాయణ , , శ్రీ ఏడిద సతీష్ (రాజా), టీఎస్టీఏ అధ్యక్షుడు కే. ఆర్. రామన్, టీ ఎస్ టీ ఏ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్, టీ ఎస్ టీ ఏ కార్యదర్శి వెల్మటి నారాయణదాస్ ,జగదీష్ గారు, మధుగారు, సందీప్ గారు రామరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో కూడా FNCC నుంచి చాలా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఈ టెన్నిస్ టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసి ముందుకొచ్చిన మా స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా అడగ్గానే మా మనవిని మన్నించి ఈవెంట్ కి విచ్చేసిన హీరో శ్రీ నాగ శౌర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

హీరో శ్రీ నాగ శౌర్య గారు మాట్లాడుతూ : ఈ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు నేను కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ని. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ వరకు ఆడాను. ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యాను. ఇప్పుడు FNCC తరఫున ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం. ఈవెంట్ కి నన్ను గెస్ట్ గా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ లో నన్ను కూడా భాగం చేసినందుకు అది శేషగిరిరావు గారికి, ముళ్ళపూడి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆటగాళ్లందరూ ఈవెంట్ కోసం ఎంత ఎక్సయిటెడ్ గా ఉన్నారో తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ బాగా ఆడాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

FNCC మాజీ ప్రెసిడెంట్ కేల్ నారాయణ గారు మాట్లాడుతూ : FNCC తరపున స్పోర్ట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. బెస్ట్ టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోడ్స్ ఇవన్నీ కూడా ట్విన్ సిటీస్ లో మన దగ్గరే ఉన్నాయి. స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు స్పోర్ట్స్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి విషయం. ఇక మీదట కూడా ఇలాంటి టోర్నమెంట్స్ అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా అర్జున అవార్డు అలాగే స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లో అవార్డ్స్ గెలిచిన వాళ్లని మెంబర్షిప్స్ అందించడం సపోర్ట్ చేయడం చేశాం. ఇంక ముందు కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము స్పోర్ట్ పీపుల్ ని సపోర్ట్ చేస్తాము అని అన్నారు.

FNCC స్పోర్ట్స్ COMMITTEE CHAIRMAN చాముండేశ్వరి నాథ్ గారు మాట్లాడుతూ : ఈ రోజున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం దీంట్లో ఎంతోమంది స్పోర్ట్స్ పీపుల్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. FNCC నుంచి ముందు ముందు ఇంకా ఇలాంటి ఎన్నో టోర్నమెంట్స్ జరిపిస్తాము. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీ నాగశౌర్య గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ : ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ తరఫున నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. మాకు స్పాన్సర్ చేసి సపోర్ట్ చేస్తున్న సురన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తి గారికి, హెచ్ ఈ ఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎం.డి ఐ. వి. ఆర్. కృష్ణంరాజు గారికి, హెల్త్ ఆన్ అస్ చైర్మన్ పి. శివకృష్ణ గారికి, లెజెండ్ బిల్డర్స్ నాగేశ్వరరావు గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ వి. నారాయణ దాస్ గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ రావు గారికి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామన్ గారికి కృతజ్ఞతలు. మా ఫార్మర్ సెక్రెటరీ సోమరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్పాన్సర్ విషయాల్లో గాని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు పక్కనే ఉండి ఎప్పుడూ కూడా సోమరాజు గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మరి టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగదీష్ గారు, మధుగారు, సందీప్ గారు రామరాజు గారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇవాళ అనగా 6వ తారీఖున మొదలైన పురుషుల టోర్నమెంట్స్ 12వ తారీకు వరకు జరుగుతాయి. 13వ తారీకు నుంచి ఉమెన్స్ టోర్నమెంట్ మొదలై 19వ తారీకు వరకు జరుగుతాయి. ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

13 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago