నమస్కారం,
ఈశా గ్రామోత్సవం రాష్ట్ర (డివిజినల్) స్థాయి పోటీలు సెప్టెంబర్ 10న ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారంలో జరగనున్నాయి.
2004 నుండి ఈశా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈశా గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలు ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు. సాధారణ గ్రామీణులకు ఆటలో భాగమై, ఆడడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూపించడమే దీని ప్రత్యేకత.
ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని అయిదు రాష్ట్రాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 3 స్థాయిల్లో నిర్వహిస్తున్నారు – జిల్లా, డివిజినల్ ఇంకా ఫైనల్స్. ఫైనల్స్ కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో నిర్వహిస్తారు.
తెలంగాణలో 9 జిల్లాల నుండి జిల్లా స్థాయి పోటీలకు 227 వాలీబాల్ & 119 త్రోబాల్ టీం లతో అద్భుతమైన స్పందన లభించింది.సుమారు 2700 ఆటగాళ్ళు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణలోని 9 జిల్లాల విన్నర్ లు ఇంకా రన్నర్ లు పాల్గొనే ఈ ఉత్సాహభరిత పోటీలకు మీ అందరినీ ఈ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
తేదీ: సెప్టెంబర్ 10,2023, ఆదివారం
సమయం:పోటీలు ఉ.9 నుండి,
ముగింపు కార్యక్రమం : 4 PM నుండి 5:30PM వరకు
స్థలం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారం
శ్రీమతి కొర్ర లక్ష్మి,ఐఏఎస్,డైరెక్టర్,SATSగారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
Cloud templates
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
96189 54075
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…