ఈసారైనా’ టీమ్. దక్షిణాది భాషల్లో నవంబర్ 8 న ఘనంగా విడుదల

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా ‘ఈసారైనా’. ఈ సినిమా కథ అందమైన గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిత్రం లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

హీరో విప్లవ్ మాట్లాడుతూ, “ఈ సినిమా మీ అందరి ముందుకు రానున్నందుకు కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసారు. ఈ సినిమా కి నేనే ప్రొడ్యూసర్ ని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి” అన్నారు.

హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ, “శిరీష క్యారెక్టర్ నాతో చేయించిన విప్లవ్ కి తాంక్స్. ఈ సినిమా కి షూటింగ్ చేస్తున్న రోజులు సమ్మర్ హాలిడేస్ లాగ అనిపించింది. నా ఫస్ట్ సినిమా కి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమా మాత్రం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.” అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ, “విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత నాకు క్యారెక్టర్ చెప్పగానే, నాకు నచ్చేసింది. ఈ రోజు ప్రివ్యూ లో చూసాక అనిపించినా విషయం ఏంటి అంటే, అన్ని సీన్స్ చాలా ప్లెజంట్ గా అనిపించాయి.” అన్నారు.

కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, “ఇక్కడకు వచ్చినందుకు అందరికీ చాలా థాంక్స్. నా దృష్టి లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. నా దృష్టి లో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే, అది అందరికీ నచుతుంది. ఈ సినిమా లో కూడా అందరూ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నవంబర్ 8 న థియేటర్స్ లో ఈ సినిమా చూడొచ్చు.” అన్నారు.

నటుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ, “ఈ సినిమా ని నేను లాస్ట్ ఇయర్ చేశాను. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా లో పెద్ద సెటప్ ఏమి ఉండదు కానీ విప్లవ్, సంకీర్త్ అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనిపిస్తుంది. నవంబర్ 8 న ఈ సినిమా ని థియేటర్స్ లో చూడొచ్చు.” అన్నారు.

నటుడు ప్రదీప్ రాపర్తి మాట్లాడుతూ, “ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు విప్లవ్ గారికి, నిర్మాత గారికి, మెయిన్ లీడ్ కి తాంక్స్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకం ఉంది” అన్నారు.

సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది.

నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్

టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago