వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో ‘కుంభ’ చిత్రం ప్రారంభం

▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘కుంభ’
▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన వి స‌ముద్ర‌
▪️ వి. స‌ముద్ర ద‌ర్శ‌క నిర్మాణంలో 5 సినిమాలు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ ‘కుంభ’. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర మాట్లాడుతూ… ”బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో ‘కుంభ’ చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే ‘కుంభ’ ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. ‘కుంభ’ సినిమాతో పాటు ‘వరద రాజు గోవిందం’, ‘రామ జన్మభూమి’, ‘ఇండియా సీఈఓ’, ‘ప్రొడక్షన్ నెం 5’ వంటి సినిమాలు కూడా ఆరు భార‌తీయ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయ‌బోతున్నాను. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉంది. మా కొత్త‌ సినిమాల‌కు మీ ఆశీర్వాదాలు ఉండాలి.” అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. ”వి సముద్ర గారు చేసివి అన్ని హిట్ టైటిల్సే. ఆయన ప్ర‌తి సినిమా.. ప్రతి ఊరిలో చెప్పుకుంటారు. ఆయ‌న సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. సముద్ర గారి సినిమాకు పని చేయడం నా అదృష్టం జీవితమంతా ఈ అవ‌కాశాన్ని గుర్తుంచుకుంటాను.” అని అన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర గారు త‌న‌కు అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉంద‌ని హీరో విజ‌య్ రామ్ అన్నారు. ఆధ్యాత్మికవెత్త రాజు చిత్ర‌యూనిట్‌కు దేవదేవతల ఆశీర్వాచనాలు అందజేశారు. ”సముద్ర గారు గొప్ప డైరెక్టర్. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుంది” అని కన్నా దేవరాజ్ భ‌రోసా వ్య‌క్తం చేశారు.
ఈరోజు శ్రావణ గురువారం రోజున పురస్కరించుకొని మా పిల్లల సినిమా స్క్రిప్ట్ పూజ ఈ సందర్భంలో జరుపుకోవడం జరిగింది…. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మా పిల్లల సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని v.సముద్ర గారు తెలిపారు

హీరో విజయరామ్ మాట్లాడుతూ గతంలో థియేటర్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్న నాకు ఈ సినిమాలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ v సముద్ర గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాకుండా ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఇంటిలో మనిషిలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రతో పరిచయం కాబోతున్న సూరజ్ ఆదిత్య సింగ్ ఈ సినిమా తో సముద్ర గారు వంటి గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం నా పూర్వజన సుకృతం అని భావిస్తున్నాను…

న‌టీ నటులు :
విజయ రామ్ (హీరో), సూరజ్ ఆదిత్య సింగ్ (విలన్) త‌దిత‌రులు. జ్యోతి యాదవ్, రవి జంగ్, వరలక్ష్మి శరత్, కుమార్, ఎస్తేర్, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, రవి కాలే, గోలీ సోడా మధు, కోట శ్రీనివాసరావు, దాసన్న, ఆదిత్య సింగ్, జినాల్ పాండే, బెసెంట్ రవి, ధర్మా రెడ్డి, కొమ్మాలపాటి గీత, సునీత. ప్రియదర్శిని. శాంతి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి సముద్ర
నిర్మాత:- వి సముద్ర రావు
సంగీత దర్శకుడు:- వరంగల్ శ్రీను
డీవోపీ:- శ్రీ వెంకట్
ఎడిటర్ :- నందమూరి హరి
రచయిత, సహ దర్శకుడు:- వెంకటేష్ చిక్కాల
ఆర్ట్ డైరెక్టర్:- విజయ్ కృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రఫీ:- అజయ్ – senha
ఫైట్ మాస్టర్:- మల్లి
కాస్ట్యూమ్:- మెహబూబ్
మేకప్ :- భాషా
పీఆర్ఓ: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago