రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ప్రస్తుతం తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రెబెల్ ఫ్యాన్స్ “రాజా సాబ్” సినిమా అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ మారుతి.
డైరెక్టర్ మారుతి స్పందిస్తూ – “రాజా సాబ్” సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో చేస్తున్నాం. కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఔట్ పుట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయితే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్టి కృషి. ఏ ఒక్కరి క్రాఫ్ట్ కాదు. ఎంతోమంది శ్రమ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైమ్ కు కొంత ఆలస్యమవుతోంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.
ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తోంది. “రాజా సాబ్” సినిమాతో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…