ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న సినిమాకు `ఆకాశం దాటి వస్తావా` అనే టైటిల్ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను సోమవారం మేకర్స్ మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా విడుదల చేశారు. శశి కుమార్ ముతులూరి దర్శక్వంలో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “ ఓసందర్భంలో కొరియోగ్రాఫర్ యష్ను చూడగానే బావున్నాడనిపించింది. నా సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తానని అన్నాను. బలగం సినిమా సెట్స్పై ఉన్న సమయంలో శశిని పిలిచి బలగం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయాలని అన్నాను. అలా అనుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ యష్ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాం. తనకు ఆల్ రెడీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతో అదింకా పెరుగుతుంది. సింగర్ కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. శశి, యష్, హర్షిత్, హన్షితలకే ఈ క్రెడిట్ దక్కుతుంది. అన్నీ పాటలను ఎక్స్ట్రార్డినరీగా చేయించారు. ఇదొక మంచి మ్యూజికల్ మూవీ. కొత్త టాలెంట్ను పరిచయం చేయాలనే డి.ఆర్.పి బ్యానర్లో శశి, యష్లతో మరో ప్రయత్నం చేస్తున్నాం. మహేష్ ఈ సినిమాకు స్టోరి, డైలాగ్స్ అందించారు. యూత్ఫుల్ సినిమాను తీసుకొస్తున్నాం. ఈ సినిమాకు `ఆకాశం దాటి వస్తావా` అనే టైటిల్ను పెట్టాం. శశి పర్సనల్ లైఫ్ నుంచి ఈ స్టోరీని చేశారు. తన పర్సనల్ నుంచి వస్తోన్న స్టోరి కావటంతో చాలా కష్టపడుతున్నాడు. ప్రేమికులుగా ఉన్నప్పుడు అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా.. అదే ఈ సినిమా టైటిల్. ఔట్ అండ్ ఔట్ యూత్ఫుల్ కంటెంట్ ఇది. త్వరలోనే సినిమాను మీ ముందుకు సినిమాను తీసుకొస్తాం“ అన్నారు.
రైటర్ మహేష్ మాట్లాడుతూ “దిల్రాజుగారి కాంపౌండ్లో వర్క్ చేసే అవకాశాన్ని నాకు డైరెక్టర్ శశిగారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. అవకాశం ఇచ్చిన దిల్రాజుగారు, శిరీష్గారు, డైరెక్టర్ శశి, యష్లకు థాంక్స్“ అన్నారు.
కార్తీక మురళీధరన్ మాట్లాడుతూ “దిల్ రాజుగారితో కలిసి సినిమా చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మలయాళంలో ఇది వరకు రెండు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా తొలి సినిమా. యష్, శశి వంటి మంచి టీమ్తో పనిచేశాను. తెలుగు ప్రేక్షకులు ఆశీర్వాదాన్ని అందిస్తారని భావిస్తున్నాను“ అన్నారు.
డైరెక్టర్ శశికుమార్ మాట్లాడుతూ “నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి దిల్ రాజుగారు నన్నుపిలిచారు. ఎవరైనా జీవితంలో అన్నీ బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ రిలేషన్లో గొడవలు జరుగుతాయి. ఇదే పాయింట్తోనే సినిమా చేస్తామని చెప్పి కథ చెప్పాను. రాజుగారికి నచ్చటంతో సినిమా సెట్స్పైకి వచ్చింది. దిల్ రాజు కొత్త వాళ్లతో చేసిన సినిమాల్లో 99 శాతం సక్సెస్లను సాధించాయి. ఇప్పుడు డి.ఆర్.పి బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం బలగం కూడా పెద్ద హిట్. మాది రెండో సినిమా. రాజుగారి జడ్జ్మెంట్కు ఓ విలువ ఉంది. ఆకాశం దాటి వస్తావా అనేది కూడా ఆయన జడ్జ్మెంట్. మేం దానికి ప్రతినిధులుగా వ్యవహరించాం. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. యష్ డాన్స్ను నేను చాలానే చూశాను. ఇప్పుడు తనతోనే సినిమా చేశాను. ఈ సినిమాకు లవ్ అనేది మెయిన్ సోల్. ఈ టైటిల్ పెట్టటానికి కారణం తెలియాలంటే టీజర్ చూడాల్సిందే. సినిమాలో 6 అద్భుతమైన పాటలు ఉన్నాయి. హర్షిత్, హన్షిత్ గారు సపోర్ట్తో మంచి ఔట్పుట్ను మీ ముందుకు తీసుకొస్తాం“ అన్నారు.
హీరో యష్ మాట్లాడుతూ “ఇదంతా నాకొక కలలాగానే ఉంది. రాజుగారికి థాంక్స్. రాజుగారు ఫోన్ చేసి పిలవగానే ఆయన సినిమాలో కొరియోగ్రఫీ చేయాలేమోనని వెళ్లాను. తీరా హీరో నువ్వేనని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. నేను ఈ సినిమా చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్. శశిగారికి థాంక్స్. హర్షిత్గారు, హన్షిత గారికి థాంక్స్. `ఆకాశం దాటి వస్తావా` మంచి లవ్ జర్నీ. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్“ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…