పేక మేడలు సినిమా ని సపోర్ట్ చేసిన రానా దగ్గుబాటి, అడవి శేష్, విశ్వక్ సేన్ కి ధన్యవాదాలు – నిర్మాత రాకేష్ వర్రే – జూలై 19న సినిమా విడుదల
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్ మరియు విజయవాడలో వేసిన స్పెషల్ షోస్ లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న పేక మేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు మాట్లాడుతూ : ఈ సినిమా చూసి నచ్చి ఇంకా బాగా ప్రమోట్ చేయొచ్చు అనిపించింది. ఇలాంటి సినిమాని మంచిగా ప్రమోట్ చేసి ప్రేక్షకులు ముందు తీసుకెళ్తే ఇంకా పెద్ద విజయం అవుతుంది. పెద్ద సినిమాలు ఏ రేట్ పెట్టిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు కానీ చిన్న సినిమాలు కి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. ఈ సినిమా కోసం టికెట్ రేట్లను ₹100 కు తగ్గించాం. పెద్ద సినిమాలతో పోటీ పడలేక చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రేక్షకులకు మంచి అందించే ప్రయత్నంలోనే విజయవాడ, వైజాగ్ హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే టికెట్ రేట్ పెట్టి ఎక్కువమంది సినిమా చూసేలాగా ప్లాన్ చేసాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈనెల 19న విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని నమ్మకం నాకుంది అన్నారు.
డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెయిడ్ ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది ప్రీ సక్సెస్ మీట్ లాగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గా సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి వచ్చిన ధీరజ్ గారికి కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ అనూష కృష్ణ మాట్లాడుతూ : మీడియాతో స్టార్ట్ నుంచే ప్రమోషన్స్ లో మీట్ అవుతు మీడియా కూడా మా ఫ్యామిలీ లాగా అయిపోయారు. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎంత ఇష్టంగా ఈ సినిమా తీసాము ప్రేక్షకులకు అంతే నచ్చుతుంది. ఈ 19న సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ : వైజాగ్, విజయవాడలో పెయిడ్ ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి చేస్తున్న వినూత్న ప్రమోషన్స్ చూసి పేక మేడలు హీరోగా నన్ను గుర్తు పడుతున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచి మీడియా సపోర్ట్ చేస్తున్న విధానం చాలా బాగుంది. మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పేట్ ప్రీమియర్స్ కి వస్తున్నా రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. పేక మేడలు టీం అని గుర్తుపట్టి సినిమా గురించి చాలా పాజిటివ్ గా చెబుతున్నారు. ధీరజ్ నాకు ముందు నుంచే పరిచయం ఉన్న ఈ సినిమా చూసి నచ్చి నేను రిలీజ్ చేస్తాను ముందుకు వచ్చాడు. ధీరజ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సినిమాను సపోర్ట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారికి, అడివి శేష్ గారికి, విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్
టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…