ప్రశాంత్ వర్మ కథతో పెద్ద స్పాన్ వున్న దేవకీ నందన వాసుదేవ సినిమా చేయడం అధ్రుష్టంగా భావిస్తున్నా : అశోక్ గల్లా
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
ఆదివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో అశోక్ గల్లా సీరియస్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తుండగా, ఒక వైపు సాధువు, మరొక వైపు అంత శక్తివంతమైన గెటప్ లో మనం చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మనం చూడవచ్చు.
సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని టీజర్లో తేలింది. మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బాలక్రిష్ణ మాట్లాడుతూ, మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు రిలీజ్ లున్నాయి. అవి వచ్చినా సరే మా సినిమా మాదే. మాది సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. మేం కొత్తవాళ్లమే అయిన మంచి ఔట్ పుట్ తో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాం. థియేటర్ లో సినిమా చూశాక మంచి సినిమా తీశామనే ఫీలింగ్ మీకూ కలుగుతుంది. ఇక ప్రశాంత్ వర్మ కథ గురించి తెలిసిందే. సరికొత్త ఐడియాతో ఆయన రాశారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఆకట్టుకునేలా మంచి బాణీలు ఇచ్చారు. మాటల్లో పదునైనవిగా సాయిమాధవ్ రాశారు. దర్శకుడు ఫర్ ఫెక్ట్ గా సినిమాను చేశారు. నవంబర్ 14న సినిమా విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
కథానాయిక మానస మాట్లాడుతూ, గత ఏడాది ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది. ఈరోజు విడుదలకు దగ్గరైంది. నా మొదటి సినిమాలో సీనియర్స్ తో నటించడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇందులో నా పాత్రపేరు సత్యభామ. అందుకే పాత్రకు కనెక్ట్ అయ్యాను. తనకు ఎలాంటి ఒత్తిడిలు వున్నా ధైర్యంతో ముందుకుసాగే పాత్ర అది. కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందించారు. అందరినీ అలరించేదిగా వుంటుందని నమ్ముతున్నాను అన్నారు.
దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ, గొప్ప చిత్రం చేశానని చెప్పగలను. ప్రశాంత్ ఇచ్చిన కథ యూనిక్ స్టయిల్ లో వుంది. కథ ఇచ్చాక సోల్ దెబ్బతినకుండా మీకు నచ్చిన రీతిలో చేయమని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పక్కా కమర్షియల్ తో కూడిన సినిమాగా తీశాం. ఇంతకు పూర్వం కూడా ఇలాంటి కథ రాలేదు. మురారి సినిమాతో భీమ్స్ పోల్చారు. అంతకుమించినదిగా వుంటుందని చెప్పగలను. రసూల్ కెమెరా, ఫైట్స్ సినిమాకు ఆకర్షణ అయితే, అశోక్ టాప్ రేంజ్ హీరోలా చేశాడు. ఆదిపురుష్ లో నటించిన దేవదత్త నాగ్ కూడా బాగా నటించారు. మానస చాలా సహకరించి సినిమా బాగా వచ్చేలా నటించింది. మొదటినుంచి హిట్ సినిమా చేయాలని పట్టుదలతో తీశాం. అన్నారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, ఇది నాకు రెండో సినిమా. ముందుగా ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కథ అంటే ఆడియన్ కు ఏదో గట్టి కథ వుంటుందని గ్రహించేస్తారు. ఈ కథలో సోల్ చాలా డెప్త్ గా వుంటుంది. ఇంత కమర్షియల్ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇక మానసకు చాలెంజింగ్ రోల్. ఈ సినిమా తర్వాత ఆమె స్థాయి పెరుగుతుంది. నవంబర్ 14న సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
అనంతరం విలేకరుల అడిగిన పలు ప్రశ్నలకు నటీనటులు ఇలా సమాధానమిచ్చారు.
దర్శకుడు: గుణ 369 అనేది ఓ సందేశంలో తీశాను. ఈ సినిమా సత్ సంకలత్పంతో శక్తి వైబ్రేట్ అ యి మనకు ఎలా హెల్ప్ చేస్తుందనే సందేశం ఇందులో చెప్పాం. టైటిల్ లో వాసుదేవ ఎందుకు పెట్టామంటే బ్యాక్ డ్రాప్ క్రిష్ణుడు కనిపిస్తాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టేలా కథ కుదిరింది. డివైన్ ఫీల్ ఈ సినిమాలో వుంది. సినిమా ఆరంభంనుంచి ముగింపు వరకు ప్రతి పాత్రా హైలైట్ అయ్యేలా వుంటుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాను.
మానస మాట్లాడుతూ, ఈ సినిమాలో డాన్స్ కూడా బాగా చేశాను. మిస్ ఇండియా నేపథ్యం కాబట్టి ఆ ఫార్మెట్ నుంచి బయటకు వచ్చి సినిమాలో డాన్స్ చేయడం నాకు ఛేంజ్ గా అనిపించింది. కాలేజీ నుంచి మోడలింగ్ చేశాను. మిస్ ఇండియా నుంచి సినిమా అనే మరో లోకంలోకి వచ్చాను. చిన్నతనం నుంచి క్యూరియాసిటీ వుండేది. సినిమా కోసం పలు వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా పరంగా అర్జున్ గారే నా గురువు. పాత్రను అద్భుతంగా మలిచారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, నేనున్న పరిస్థితికి మంచి సినిమాలు చేయాలి. పేరు చెడగొట్టకూడదు. కష్టపడి చేయాలి. అది సినిమాలో కనిపిస్తుంది. కథ విన్నప్పుడు బాగా నచ్చేసింది. పెద్ద స్పాన్ వున్న కమర్షియల్ సినిమా నాకు రెండో సినిమాగా రావడం చాలా హ్యాపీగా వుంది. డాన్స్ అనేది నేర్చుకుని బాగా చేశాను. ఇది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగేకథ. గెటప్స్ కూడా వినూత్నంగా వేయించారు. ఇందులో నాపేరు క్రిష్ణ. అమ్మచెబితే ఏదైనా చేసే కుర్రాడు. దేవుడిపై వున్న నమ్మకంకూడా అలాంటిదే. స్వేచ్ఛ కోరుకునే కుర్రాడి కథ. మహేష్ బాబు టీజర్ చూశాక, బాగుందని కితాబిచ్చారు.
ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది, దీనికి కథను హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు, ప్రశంసలు పొందిన సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.
ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల మరియు రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్గా బాధ్యతలు స్వీకరించారు.
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస
సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకుడు: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ : నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
PRO: వంశీ-శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…