బ్లాక్బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ కథానాయకుడిగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’.
పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 30న భారీ ఎత్తున తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ను గమనిస్తే హీరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న దేవ్ విలన్కు గట్టి పంచ్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా…
హీరో దేవ్ మాట్లాడుతూ ‘‘‘అహో! విక్రమార్క’తో, పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 30 పాన్ ఇండియా లెవల్లో భారీ లెవల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు నాలోని నటుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్షకులు మరో కోణాన్ని వెండితెరపై చూస్తారు’’ పేర్కొన్నారు.
దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క’ సినిమా పోలీసుల పవర్ను తెలియజేసేది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. ఫస్ట్ లుక్, టీజర్లకు చాలా మంచి స్పందన వచ్చింది. దేవ్ ను సరికొత్తగా చూస్తారు. ఆగస్ట్ 30న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు.
నటీనటులు: దేవ్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాతలు : ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా.
దర్శకత్వం : పేట త్రికోటి
కథ :పెన్మెత్స ప్రసాద్ వర్మ
సంగీతం : రవి బస్రూర్ మరియు ఆర్కో ప్రవో ముఖర్జీ
కెమెరా మెన్ : కరమ్ చావ్లా, గురు ప్రసాద్. ఎన్
ఎడిటర్ : తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
స్టంట్స్: రియల్ సతీష్
పి.ఆర్.ఒ: వంశీ కాకా
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…