“దయా” సీజన్ 2 చాలా పెద్ద స్పాన్ లో తెరకెక్కిస్తా – పవన్

రీసెంట్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన వెబ్ సిరీస్ దయా. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు. బిగినింగ్ టు ఎండింగ్ దయా వెబ్ సిరీస్ ను ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని. దయా సూపర్ హిట్టైన నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. పవన్ సాధినేని మాట్లాడుతూ

  • దయా వెబ్ సిరీస్ కు వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి మా వెబ్ సిరీస్ చూస్తున్నారు. ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల చేసిన టూర్ లోనూ ప్రతి ఏరియాలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జేడీ చక్రవర్తి గారిని దయా అని పిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచైతే చాలా కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయి. బెంగాలీ వెబ్ సిరీస్ తక్ ధీర్ నుంచి ఇన్స్ పైర్ అయి దయా కథ రాసుకున్నాను. అయితే తక్ ధీర్ లో ఇంత విస్తృతమైన కథ ఉండదు. రిపోర్టర్, దయా అసిస్టెంట్ ఇలా..ఇన్ని క్యారెక్టర్స్ ఉండవు. ఆ వెబ్ సిరీస్ నుంచి కేవలం ఆంబులెన్స్ డ్రైవర్ కు డెడ్ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా అంతా నేను రాసుకున్నదే.
  • జేడీ చక్రవర్తిని దయా క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం హాట్ స్టార్ డిసిషన్. అయితే ఆయన నటుడితో పాటు దర్శకుడు కాబట్టి ఈ కథలో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో అనుకున్నా. జేడీ ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పాలనే అనుకున్నాను. ఫోన్ లో మాట్లాడిన తర్వాత నేను చేయబోయే సిరీస్ ఆయనకు అర్థమైంది. జేడీకున్న ఎక్సీపిరియన్స్ కు దర్శకుడి విజన్ తెలుసుకోగలరు. కథ పంపిస్తే ఆయన చదవకుండానే ఓకే చెప్పారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు.
  • దయా సిరీస్ లో మీరు చూసిందంతా ఒక గ్లింప్స్ మాత్రమే. దయా, అలివేలు క్యారెక్టర్స్ మెయిన్ గా చూశారు. అసలైన కథ, ట్విస్ట్ లు సెకండ్ సీజన్ లో ఉంటాయి. ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు చాలా తక్కువ రిసోర్స్ లతో చేశాం. ఇది క్లిక్ అయితే ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతాయి సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా చేయొచ్చని ఆశించాం. మేము ఎక్స్ పెక్ట్ చేసినట్లే ఫస్ట్ భాగం మంచి హిట్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ ను మరింత పెద్ద స్పాన్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయబోతున్నాం.
  • ఈ వెబ్ సిరీస్ కథను సినిమాగా చేసినా ఇంత డీటెయిల్డ్ గా, ఇన్ని క్యారెక్టర్ లతో తెరకెక్కించడం సాధ్యం కాకపోయేది. వెబ్ సిరీస్ కాబట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడా ఏ సీన్ కావాలని పెట్టింది కాదు. అన్నీ కథలోని ఇంటెన్సిటీని తెలిపేందుకే ఉపయోగించాం. కొన్ని సీన్స్ ఇబ్బందిగా ఉన్నాయని చెబుతున్నారు అయితే…అవి ఆ పాత్రల యొక్క బాధను, స్ట్రగుల్ ను చెప్పేందుకు మాత్రమే పెట్టాం. సిరీస్ ను ఫ్లోలో చూస్తున్నప్పుడు ఎవరికీ ఇబ్బందిగా అనిపించదు.
  • దయా సీజన్ 1కు డబుల్ స్కేల్ లో సీజన్ 2 ఉంటుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. అన్నీ కుదిరాక వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తాం. ఇకపై సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తాను. గీతా ఆర్ట్స్ లో నేనొక సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నా. పెద్ద కాస్టింగ్ తో ఆ సినిమా ఉంటుంది. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో నాకు కావాల్సిన కాస్ట్ అండ్ క్రూ డేట్స్ కోసం వేచి చూస్తున్నా. ఇంతలో దయా ఆఫర్ వచ్చింది. అరవింద్ గారికి చెబితే ఏప్రిల్ దాకా మన సినిమాకు టైమ్ ఉంది కదా ఈలోపు చేసుకుని వచ్చేయ్ అన్నారు. అలా దయా స్టార్ట్ చేశాం.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

10 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago