సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సెకండ్ వీక్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి రోజును మించిన వసూళ్లు 8వ రోజు ఈ చిత్రానికి దక్కాయి. గత 24 గంటల్లో బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో సౌతిండియాలోనే హయ్యెస్ట్ టికెట్ బుకింగ్స్ జరిగిన సినిమాగా “కపుల్ ఫ్రెండ్లీ” నెంబర్ 1 ప్లేస్ లో నిలవడం విశేషం. మొత్తంగా బుక్ మై షో లో ఈ సినిమా 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసింది. టికెట్ బుకింగ్స్ లో ట్రెండింగ్ లో నిలుస్తున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీ సెకండ్ వీక్ కూడా బాక్సాఫీస్ వద్ద ఇంప్రెసివ్ కలెక్షన్స్ రాబట్టనుంది.

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

