డెర్మటాలజీ అండ్ కాస్మటాలజీ పట్ల అవగాహన పెరుగుతున్న తరుణంలో అందుకు అవసరమైన అత్యాధునిక వసతులతో క్లినిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో కె.బి.ఆర్. పార్క్ రోడ్డులో “ఆస్ట్రిడ్ డెర్మటాలజీ అండ్ కాస్మోటాలజీ క్లినిక్” పేరుతో ఒక అల్ట్రా మోడ్రన్ క్లినిక్ ప్రారంభమైంది.
ఈ క్లినిక్ లో మూడు అత్యాధునిక పరికరాలను సుప్రసిద్ధ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ప్రాక్టీసింగ్ డెర్మటాలజిస్ట్ గా పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన “డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ” నిర్వహిస్తున్న ఈ క్లినిక్ లో పిగ్మెంటేషన్ కోసం’క్యూ స్విచ్ ‘, ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం’ హై వ్యూ ‘..స్కార్ ట్రీట్మెంట్ కోసం ఎం.ఎన్.ఆర్. ఎఫ్ .
అనే మూడు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ ను అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ” డెర్మటాలజీ కాస్మటాలజీ ట్రీట్మెంట్ లో పదేళ్ల అనుభవం కలిగిన డాక్టర్ అలేఖ్య నాకు సొంత బిడ్డ లాంటిది. ఆమె మామగారు సీనియర్ యాక్టర్ అయిన భాస్కర్ రావు గారు నాకు చిరకాల మిత్రులు .
ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది . బంజారాహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఇలాంటి వెల్ ఎక్విప్డ్ క్లినిక్ ను ప్రారంభించిన డాక్టర్ అలేఖ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా హెల్త్ అండ్ కాస్మటాలజీ అవేర్నెస్ కలిగిన మా సినిమా వాళ్లకు ఈ క్లినిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వయసు మీద పడే కొద్దీ ముఖంలో ముడతలు కనిపించకూడదు అనుకునే నాలాంటి వాళ్లకు ఇక్కడ మంచి ఏజింగ్ ట్రీట్మెంట్ లభిస్తుంది ” అని చమత్కరించారు . ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నిర్మాతగా, పరిశ్రమ ప్రముఖునిగా వెలుగొందుతున్న అల్లు అరవింద్ గారి లాంటి గొప్ప వ్యక్తి చేతులమీదుగా ఈ ఆవిష్కరణ జరగటం చాలా ఆనందంగా ఉంది.
వారికి మా కుటుంబ సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…