‘కమిటీ కుర్రోళ్ళు’ క‌లెక్ష‌న్స్‌ హ‌ల్ చ‌ల్ .. మూడు రోజుల్లో రూ.6.04 కోట్లు

Must Read

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.

ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వ‌సూళ్ల‌తో సంద‌డి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతో. క‌లెక్ష‌న్స్ విష‌యంలో ఇక‌పై ఇదే జోరుని కొన‌సాగిస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News