‘కమిటీ కుర్రోళ్ళు’ క‌లెక్ష‌న్స్‌ హ‌ల్ చ‌ల్ .. మూడు రోజుల్లో రూ.6.04 కోట్లు

Must Read

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.

ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వ‌సూళ్ల‌తో సంద‌డి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతో. క‌లెక్ష‌న్స్ విష‌యంలో ఇక‌పై ఇదే జోరుని కొన‌సాగిస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Latest News

ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ #యూఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ...

More News