డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న “డైరెక్టర్ సాబ్”

హార్తీక్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణ భార్గవ, పింగ్ పాంగ్ సూర్య, రిమ్‌జిమ్ శర్మ, జోగి బ్రదర్స్ (జోగి నాయుడు, కృష్ణంరాజు) అశోక్ కుమార్, చిన్నా, చిత్రం శీను నటీ నటులుగా హార్తీక్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
“డైరెక్టర్ సాబ్”. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి నటుడు అశోక్ కుమార్, తోటపల్లి సాయినాథ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని డైరెక్టర్ సాబ్” మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం

ప్రముఖ రచయిత తోటపల్లి సాయినాథ్ మాట్లాడుతూ… దర్శకులు రాజమౌళి గారు తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చి కొత్త దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాగే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న డైరెక్టర్ సాబ్ టీజర్ చాలా డిఫరెంట్ గా కొత్త ధనం గా చాలా బాగుంది.త్వరలో వస్తున్న ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ..సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న దర్శకుడు హార్తీక్, సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త దనం చూయించాలనే తపన తనలో కనపడింది. ఇప్పుడు విడుదల చేసిన “డైరెక్టర్ సాబ్”చిత్ర మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూడగానే మంచి పాజిటివ్ వైబ్స్ కలిగేలా చాలా బాగుంది.
రొటీన్ కు భిన్నంగా చెప్పిన కథలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు డిఫరెంట్ కథతో వస్తున్న ఈ డైరెక్టర్ సాబ్ కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత హార్తీక్ మాట్లాడుతూ..మా మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్య కొత్త కథలను ఎంకరేజ్ చేయడమే కాకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు బ్రాహ్మరధం పడుతుతున్నారు. ఇప్పుడు మేము కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సెలెక్ట్ చేసుకొని తీస్తున్న మా “డైరెక్టర్ సాబ్” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా ప్రేక్షకులందరికీ రాబోతున్న మా సినిమా కూడా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

తారాగణం:
రమణ భార్గవ, పింగ్ పాంగ్ సూర్య,రిమ్‌జిమ్ శర్మ, జోగి బ్రదర్స్ (జోగి నాయుడు, కృష్ణంరాజు) అశోక్ కుమార్, జేఎల్ శ్రీనివాస్, చిన్నా, చిత్రం శీను, నరసింహరాజు, జెమినీ సురేష్, వినోద్ బాలా, పి కృష్ణ (కెజిఎఫ్ 2 ఫేమ్), సుచరిత, భరత్ రాజ్, కెఆర్ వెంకటేష్

సాంకేతిక నిపుణులు :
లిరిక్స్, డైలాగ్స్,కథ & స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : హార్తీక్,
డి ఓ పి: గణేష్ అర్లీ,
సంగీతం: సారథి ఆర్‌జి,
ఎడిటింగ్: శాంసన్,
గాయకులు: శ్రావణి, సారథి RG, ప్రియాంక G,
PRO: లక్ష్మీనివాస్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago