‘బృంద’ ట్రైలర్ విడుదల… ఆగ‌స్ట్ 2 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌

Trailer Link:
https://www.instagram.com/reel/C9rDmIhx9Z-

అమ్మాయిలు పురుషాధిక్య ప్ర‌పంచంలో రాణించ‌టం క‌ష్టం. అయితే కొంద‌రు మాత్రం అలాంటి క‌ష్ట న‌ష్టాల‌కోర్చి త‌మ‌దైన ముద్ర‌ను వేస్తుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే బృంద‌. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా చేరిన బృంద స‌మ‌స్య‌ల‌ను చేదించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే అవి గిట్ట‌ని పైఅధికారులు ఆమెను సూటి పోటీ మాట‌ల‌తో బాధ పెడుతుంటారు. అనుకోకుండా ఓ కేసు విష‌యంలో ఆమెను స‌స్పెండ్ కూడా చేస్తారు. అస‌లు బృంద‌ను డ్యూటీ నుంచి ఎందుకు స‌స్పెండ్ చేశారు.. ఆమెకు ఎద‌రైన స‌వాలేంటి? అనే విష‌యం తెలియాలంటే ‘బృంద’ అనే తెలుగు వెబ్‌ సిరీస్ చూడాల్సిందే.

సౌత్ క్వీన్‌గా అంద‌రూ అభిమానంతో పిలుచుకునే స్టార్ హీరోయిన్ త్రిష మొట్ట మొద‌టిసారి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టారు. అది కూడా తెలుగు వెబ్ సిరీస్ కావ‌టం విశేషం. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాష‌ల్లోనూ ఆక‌ట్టుకోనుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ‘బృంద’ సిరీస్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే…

‘‘
తొమ్మిదేళ్ల నుంచి ఏమైయ్యారు మీరంతా.. నేను లేకుండా ఈ కేసుని మీరు సాల్వ్ చేస్తామ‌నుకుంటున్నారా! చెయ్యండి.. చెయ్యండి చూద్దాం…అని బృంద త‌న తోటి అధికారితో కోపంగా అంటుంది. దీంతో ప్రారంభ‌మైన బృంద ట్రైల‌ర్‌లో ఆమె ప‌నిచేసే చోట ఎదుర్కొనే అవ‌మానాల‌ను, సూటిపోటి మాట‌ల‌ను స‌న్నివేశాల రూపంలో చ‌క్క‌గా చూపించారు.

మ‌రో కోణంలో ఎక్క‌డో మారుమూల ప్రాంతాల్లో చీక‌టి ప‌డిన త‌ర్వాత జ‌రిగే న‌ర బ‌ల‌లు గురించి కూడా చూపించారు. మ‌రో స‌న్నివేశంలో యాబై మందికి పైగా చ‌నిపోయార‌ని పోలీస్ అధికారులు మాట్లాడుకుంటూ త‌మ డిపార్ట్‌మెంట్‌కే అది బ్లాక్ మార్క్ అయ్యింద‌ని అంటుంటారు.
ఇదే ట్రైల‌ర్లో ఓ వ్య‌క్తిని అనుమానాస్ప‌దంగా చూపించారు. బృంద హంత‌కుడిని వెతుకుటుంది. ఇంత‌కీ ఎవ‌రా హంత‌కుడు.. పోలీస్ డిపార్ట్మెంట్‌కే షాకిచ్చిన ఘ‌ట‌న ఏది.. బృంద కేసుని ఎలా స్వాల్వ్ చేసింది’’ అనే తెలుసుకోవాలంటే ‘బృంద’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు రైట‌ర్‌, డైరెక్ట‌ర్ సూర్య మ‌నోజ్ వంగాల.

డైరెక్టర్ సూర్య మ‌నోజ్ వంగాల‌తో క‌లిసి ప‌ద్మావ‌తి మ‌ల్లాది దీనికి స్క్రీన్ ప్లేను స‌మ‌కూర్చారు. శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సకూరుస్తోన్నఈ సిరీస్‌కు అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైన‌ర్‌గా, దినేష్‌ కె బాబు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. అన్వర్‌ అలీ ఎడిటింగ్ వ‌ర్క్ చేశారు. ఇంకా ఇందులో ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago