సద్గురు 100-రోజుల గ్లోబల్ ‘సేవ్ సాయిల్’ ఉద్యమంపై పుస్తకం హైదరాబాద్‌లో ఆవిష్కరణ

ఏప్రిల్ 14, హైదరాబాద్: ప్రపంచవ్యాప్త సేవ్ సాయిల్ ఉద్యమంలోని తెలియని కథలు, అనుభవాలను ఆవిష్కరించే కొత్త పుస్తకం ఈ రోజు హైదరాబాద్‌లో విడుదలైంది. “Save Soil: 100 Days That Moved The World” అనే శీర్షికతో వచ్చిన ఈ పుస్తకాన్ని భరతనాట్యం డాన్సర్ మరియు సద్గురువు కుమార్తె అయిన రాధే జగ్గి సంకలనం చేశారు. సద్గురు ప్రారంభించిన గ్లోబల్ సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది.

ఈ పుస్తకం 2022లో మట్టి అంతరించిపోవడంపై అవగాహన పెంచేందుకు సద్గురు చేపట్టిన 100 రోజుల, 30,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని—27 దేశాల మీదుగా జరిగిన ఈ యాత్రను—వివరిస్తుంది. ఈ ప్రయాణంలోని అంతర్గత అనుభవాలు, వాలంటీర్ల కథలు, ఫోటోలు— అన్నింటితో ఈ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను దగ్గరగా చూపిస్తాయి.

రాధే జగ్గి సేవ్ సాయిల్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సద్గురు స్థాపించిన భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం ఉన్న ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఈ యాత్రలో అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. మట్టిపై ఆధారిత కథాంశంతో చేసిన వారి బృందం ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఉద్యమ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశాయి.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల మరియు వెల్‌నెస్ వ్యాపారవేత్త శిల్పా రెడ్డి పాల్గొని, పర్యావరణ బాధ్యతలో సంస్కృతి మరియు వ్యక్తిగత పాత్రపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాధే అన్నారు:
“రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను వాళ్లపై మాత్రమే వేయడం సరైంది కాదు. మనం సహజంగా మట్టిలో సేంద్రీయ పదార్థాలను పెంచాలి. రైతులకు మద్దతు ఇవ్వాలి. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా దీనిని విధానంగా అమలు చేస్తేనే, మట్టి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది.” అన్నారు.

రామ్ మిరియాల తను స్వయంగా రాసి స్వరపరిచిన పాటను పాడారు, ఈ పాట జీవం పుట్టేది, గిట్టేది మట్టిలోనే అంటూ మనిషికి మట్టికి ఉన్న బంధాన్ని, మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. మట్టి ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ పాడిన ఈ పాట మట్టిపై ప్రేమను మరింత పెంచేలా ఉంది.

శిల్పా రెడ్డి మాట్లాడుతూ, “నేను సముద్రంలోని ఒక చుక్క మాత్రమే. ఈ ఉద్యమం యొక్క విశాలత, తీవ్రత నన్ను ఎంతో ప్రేరేపించాయి. అందుకే ఒక పాట పాడి, ఈ లక్ష్యానికి నా వంతు సమర్పణ చేయాలనిపించింది,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష సంగీతం, ఇంటరాక్టివ్ సెగ్మెంట్లు మరియు సరదా ఆటలు కూడా చోటుచేసుకున్నాయి. కొండాపూర్‌లోని అవాన్ ఎక్సెస్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణలో హైదరాబాద్ నగరంలోని వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. భూమి భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో, పరిష్కారంలో భాగస్వాములవ్వాలనే సంకల్పంతో అందరూ ఒక్కటయ్యారు.

సేవ్ సాయిల్ ఉద్యమం గురించి:

సేవ్ సాయిల్ ఉద్యమాన్ని 2022లో సద్గురు ప్రారంభించారు. వ్యవసాయ భూముల్లో సేంద్రీయ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3–6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మట్టినాశన సంక్షోభాన్ని ఎదుర్కోవడం దీని లక్ష్యం.

ఈ ఉద్యమం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు మరియు పౌరులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం మరియు వాతావరణ స్థిరత్వానికి మట్టి ఎంత కీలకమో చాటుతోంది. గత నాలుగేళ్లలో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 410 కోట్ల మందికి పైగా ప్రజలను చేరుకుంది, మట్టి ఆరోగ్య పునరుద్ధరణ ప్రాముఖ్యతపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఈ ప్రచారం ప్రస్తుతం పాలసీ మేకర్స్, సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేస్తూ, ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో సేంద్రీయ పదార్థాల పెంపు, స్థిరమైన భూమి నిర్వహణ పద్ధతుల ప్రోత్సాహంపై దృష్టి సారిస్తోంది. అలాగే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ, మట్టికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తోంది.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

2 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago