ఇంట గెలిచి రచ్చ గెలిచే దర్శకుల సంఖ్య సహజంగానే చాలా తక్కువుంటుంది. రచ్చ గెలిచి మళ్ళీ ఇంట “రచ్చ” చేసేవారి సంఖ్య మరీ అరుదుగా ఉంటుంది. ఆ అరుదైన జాబితాలోనూ స్థానం సంపాదించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు!!
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం (1986లో) దర్శకత్వశాఖలో అరంగేట్రం చేసి, పలువురు దిగ్గజాల దగ్గర శిష్యరికం చేసి, దర్శకత్వంలోని మెళకువలన్నీ ఆకళింపు చేసుకున్న గోసంగి… దర్శకుడిగా తన పరిచయ చిత్రం “భవాని”తో సంచలన విజయం సొంతం చేసుకున్నారు. తర్వాత “శివుడు, మనమిద్దరం” చిత్రాలతోనూ మెప్పించిన సుబ్బారావు… అనుకోకుండా భోజపురి చిత్ర రంగప్రవేశం చేసి, అక్కడి పరిశ్రమలో సంచలనానికి పర్యాయపదంగా మారారు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా “అయిదు హ్యాట్రిక్”లు (15 సినిమాలు) సాధించి… తెలుగువారంతా గర్వంగా రొమ్ములు విరుచుకునేలా “రాజమౌళి ఆఫ్ భోజపురి”గా నీరాజనాలు అందుకుంటున్నారు!!
గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో భోజపురిలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 15 చిత్రాలలో… మూవీ మొఘల్ స్వర్గీయ రామానాయుడు నిర్మించిన చిత్రంతోపాటు… లెజండరీ ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ సోదరుడు సాయిబాబా నిర్మించిన రెండు చిత్రాలు కూడా ఉండడం గమనార్హం!!
చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన “బిగ్ బ్రదర్” ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై శంకర్ రావు కంఠంనేని – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది!!
ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ… “అనుకోకుండా భోజపురిలో ఎంట్రీ ఇచ్చిన నాపై అక్కడి పరిశ్రమ… అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలతో కట్టిపడేసి “దత్తత” తీసేసుకుంది. తెలుగు రీ-ఎంట్రీ కోసం ఎప్పటికప్పుడు సన్నాహాలు చేసుకున్నా… భోజపురిలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. మిత్రుడు ఘంటా శ్రీనివాసరావు ఒత్తిడి వల్ల… ఎట్టకేలకు తీరిక చేసుకుని “బిగ్ బ్రదర్”తో దర్శకుడిగా నాకు జన్మ ఇచ్చిన కన్నతల్లి ఒడికి చేరుకుంటుండడం చాలా సంతోషంగా, ఎంతో ఉద్వేగంగా ఉంది. ఇకనుంచి నా సినీ జీవితం తెలుగులోనే” అంటున్నారు!!
ఇకపై వరుసగా తెలుగులో చిత్రాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న గోసంగి… ఇప్పటికే రెండు సినిమాలకు సంతకాలు చేసి ఉండడం, ఆ రెండు ప్రాజెక్ట్స్ ప్రి-ప్రొడక్షన్ దశల్లో ఉండడం గమనార్హం. ఇప్పటికీ ఉరిమే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, తన టీమ్ ను ఉత్తేజితం చేసే గోసంగి సుబ్బారావు తన “గ్లామర్ రహస్యం” గురించి అడిగితే గట్టిగా నవ్వేశారు. అదే ప్రశ్న మరోసారి రెట్టించినప్పుడు… “కష్టాలను సుఖాలను ఒకేలా తీసుకోవడం, మనసులోకి ఎలాంటి కల్మషాలు చొరబడనీయకుండా నియమబద్ద జీవన విధానం పాటించడం, ఎవరినుంచైనా అనుచితంగా లబ్ది పొందాలనే యావ లేకపోవడం” తన గ్లామర్ సీక్రెట్స్ అని వివరించారు!!
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…