బలగం’ వంటి సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరు..దిల్ రాజు

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన‌ సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 3న రిలీజైన ఈ సినిమా స‌క్సెస్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు..

  • దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ను హ‌ర్షిత్, హ‌న్షిత నిర్మాత‌లుగా స్టార్ట్ చేశారు. నేను నిర్మాత‌గా జ‌ర్నీ స్టార్ట్ చేసిన‌ప్పుడు ఆర్య‌, బొమ్మ‌రిల్లు వంటి సినిమాల‌ను చేశాను. అప్పుడు కొత్త వాళ్ల‌తోనే ఆ సినిమాలు చేశాను. క్ర‌మ‌క్ర‌మంగా అలాంటి అప్రోచ్ నా సైడ్ నుంచి త‌గ్గిపోయింద‌నాలి. అందుకు కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు. అందుకని హ‌ర్షిత్, హ‌న్షిత‌ల‌ను కూర్చో పెట్టుకుని రీస్టార్ట్ కావాల‌ని చెప్పాను. నిర్మాణ రంగంలోకి రావాల‌ని అనుకుంటున్నారు, ఆస‌క్తి ఉంద‌ని అంటున్నారు కాబ‌ట్టి జ‌ర్నీ స్టార్ట్ చేయ‌మ‌ని చెప్పాను. ఆ క్ర‌మంలో చాలా స్క్రిప్ట్స్ వింటూ వ‌చ్చాం. అప్పుడు నేను బ‌ల‌గం స్క్రిప్ట్ విన్నాను. దాన్ని విన‌మ‌ని హ‌ర్షిత్, హ‌న్షిత‌ల‌కు చెప్పాను. వాళ్లు విన్నారు, న‌చ్చింది. దీంతో పాటు మ‌రో రెండు స్క్రిప్ట్స్ న‌చ్చ‌టంతో ఆ సినిమాలు కూడా స్టార్ట్ చేశాం. వీటితో పాటు ఏటీఎం వెబ్ సిరీస్ కూడా చేశారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. బ‌ల‌గం సినిమానే దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌లో ముందుగా పూర్త‌య్యింది.
  • బ‌ల‌గం సినిమా చేసే స‌మ‌యంలో నేను హ‌ర్షిత్‌, హ‌న్షిత‌ల‌ను మాన‌సికంగా ప్రిపేర్ చేశాను. పాండమిక్ త‌ర్వాత ప్రేక్ష‌కులు చిన్న సినిమాలు చూడ‌టానికి పెద్ద‌గా రావ‌టం లేద‌ని, దీనికి స్క్రిప్ట్ స్టేజ్ నుంచే వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాలంటే ఎక్స్‌పెరిమెంట‌ల్ ఉండాల‌ని నేను వారికి చెప్పాను. అలాగే చేశారు. బ‌డ్జెట్ వాళ్లు అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే అయ్యింది. అయితే కూడా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ల్ల ఇబ్బంది రాలేదు. ఇప్పుడు వాళ్ల‌కు థియేట‌ర్స్‌లో ఏదైతే వ‌స్తుందో అది వాళ్ల‌కు ఎంజాయ్‌మెంట్‌.సినిమా చూసిన వారంద‌రూ చాలా బాగుంద‌ని అన్నారు. విమ‌ర్శ‌కులు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారు. చిన్న సినిమాలు చేసిన‌ప్పుడు ప్ర‌తీది నిర్మాత కంట్రోల్‌లోనే ఉంటుంది. చిన్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు.
  • వేణు ఎల్దండి డైరెక్ట‌ర్‌గా డెబ్యూ అయ్యాడు. త‌ను క‌థ చెప్పిన త‌ర్వాత అంతా కొత్త వాళ్ల‌తోనే ముందుకు వెళ్లాల‌నుకున్న‌ప్పుడు బ‌డ్జెట్ వేసి ఇచ్చాను. సినిమా బ‌డ్జెట్ అనుకున్న దాని కంటే 25 శాతం ఎక్కువైంది. అందుకు సినిమా ఆల‌స్యం కావ‌టం వంటి కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. వేణులో ఇంత మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని నాకు కూడా తెలియ‌దు. త‌ను క‌థ చెప్పే స‌మ‌యంలోనే నేను క‌నెక్ట్ అయ్యాను. నేను తెలంగాణ‌లో చిన్న ప‌ల్లెటూరు నుంచి వచ్చాను. మ‌నుషులు చ‌నిపోయిన‌ప్పుడు ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. అప్పుడు ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌నే దాన్ని నేను ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించాను. మ‌న సంస్కృతిలో ఏముంద‌నే విష‌యాన్ని వేణు ప‌ట్టుకున్న తీరు నాకు బాగా న‌చ్చింది. అక్క‌డి నుంచి వ‌ర్క్ చేసుకుంటూ వ‌చ్చాం. ఆ స‌మ‌యంలోనే సినిమాను క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో కాకుండా నేచుర‌ల్‌గా ఉండాల‌ని చెప్పాను.
  • చిన్న సినిమా అంటే ప్రేక్ష‌కుడితో స‌హా అంద‌రికీ చిన్న చూపు. చాలా అద్భుత‌మైన సినిమాగా ఉంటే త‌ప్ప ఆడియెన్స్ థియేటర్స్‌కు రారు. అలాంటి బ్యూటీఫుల్ కాన్సెప్ట్ మూవీనే బ‌ల‌గం. ఆ క‌థ విన‌గానే న‌చ్చేసింది. బ‌ల‌గం సినిమాను చాలా ప్రేమ‌తో చేశాను. సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయిన త‌ర్వాత ఓటీటీకి ఇచ్చేద్దామా? అని అన్నారు కూడా. ఇలాంటి సినిమాను థియేట‌ర్‌కు తీసుకెళ్ల‌టానికి నేను రంగంలోకి దిగాను. అందు కోస‌మే ముందుగానే షోస్ వేశాను. ఈ సినిమాలో మంచి ఎమోష‌న్స్‌తో పాటు మెసేజ్ ఉంది. కాబ‌ట్టి దాన్ని ఎంత మంది చూస్తే అంత మంచిద‌ని నేను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాను.
  • తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా కావ‌టంతో అది ఆంధ్ర ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అవుతుందా కాదా? అని ఆలోచించాను. నా సినిమాను డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి, డైరెక్ట‌ర్స్‌కి చూపించాను. నా డౌట్‌ను వాళ్ల‌కి వ‌క్తం చేశాను. వాళ్లు చెప్పింది ఒక‌టే. ‘సినిమా తెలంగాణ‌నా, ఆంధ్రానా అని కాదు సార్‌.. బ‌లమైన ఎమోష‌న్స్ ఉన్నాయి’ అన్నారు. అదే కనెక్ట్ అవుతుందని అన్నారు. రిలీజ్ తర్వాత సినిమా చూసిన వారందరూ అదే చెబుతున్నారు.
  • బలగం సినిమా చూసిన వారందరూ అవార్డ్ వస్తుందని అంటున్నారు. అయితే నేను అవార్డు కోసం సినిమా చేయలేదు. వస్తే మంచిదే. ఇంత‌కు ముందు నేను చేసిన శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హ‌ర్షి సినిమాల‌కు నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. కానీ నేను అవార్డుల కోసం ఆ సినిమాను చేయ‌లేదు. మంచి సినిమాల‌ను అందించాల‌నే ఉద్దేశంతో చేశాను.
  • డైరెక్ట‌ర్‌ వేణు ఎల్దండి మా బ్యాన‌ర్‌లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నాడు. రెండు నెల‌ల క్రితం త‌ను చెప్పిన ఐడియాస్‌లో ఒక‌టి బాగా న‌చ్చింది. దాని మీద వ‌ర్క్ చేయ‌మ‌ని చెప్పాను. రీసెంట్ దానికి సంబంధించిన క్లైమాక్స్ చెప్పాడు.సూప‌ర్బ్‌గా ఉంద‌నిపించ‌టంతో వ‌ర్క్ చేయ‌మ‌ని చెప్పాను. ఈ సారి చేసే సినిమా కాస్త క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉంటాయి.
  • నెక్ట్స్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌లో ఓ డాన్స్ మాస్ట‌ర్‌ను హీరోగా .. సింగ‌ర్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తూ శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నాం. అది కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్ మూవీ.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago