ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్, సునీల్, పాలడబ్బా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ప్రముఖ తమిళ నటి అమ్ము అభిరామ్ చేరారు.
తమిళ చిత్రలు రాట్సానన్, అసురన్ చిత్రంలో ఈ ఈమె తన అభినయంతో మంచి పేరు తెచ్చుకున్నారు. గోలీసోడా ఫ్రాంఛైజీగా ప్రముఖ దర్శకుడు, కెమెరామెన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. గతంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో వచ్చిన గోలీసోడా వెబ్ సీరిస్లో కూడా అమ్ము అభిరామి మంచి పాత్రను చేశారు. ఇది ఈ ఇద్దరి కలయికలో రెండో చిత్రం. ఈ చిత్రంలో అమ్ము అభిరామి పాత్ర ఎంతో పవర్ఫుల్గా, ఎమోషనల్గా కూడా ఉంటుందని, ఆమె అభినయం, పాత్ర చిత్రానికి ప్లస్ అవుతుందని, ఆమెలోని పలు కొత్తకోణాలు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని అంటున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.
సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…
"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…
ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…
హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…