75 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించిన ‘పులి మేక’

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘పులి మేక’కు అమేజింగ్ రెస్పాన్స్…ఆనందంలో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ సహా ఎంటైర్ టీమ్

హైదరాబాద్, మార్చి 3, 2023: వ‌న్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్స్‌లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజరాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఇలా ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5. పిక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్న‌పూర్ణ స్టూడియోస్ వారి లాస‌ర్ 2 . బీబీసీ స్టూడియోస్‌, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన‌. ఇంకా రేసీ, హ‌లో వ‌రల్డ్‌, మా నీళ్ల ట్యాంక్‌, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా విడుద‌టైన ఏటీఎంతో పాటు పులి మేక కూడా ఆ వ‌రుస‌లో చేరి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.

జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ క‌లిసి రూపొందించిన పులి మేక ఒరిజిన‌ల్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఇప్ప‌టికే 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించ‌టం విశేషం.

పులి మేక సిరీస్‌లో ప్రారంభం నుంచి చివ‌ర‌కు ఉండే ట్విస్టులు, ట‌ర్నుల‌ను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి క్యారెక్ట‌రైజేష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కిర‌ణ్ ప్ర‌భ అనే సిన్సియ‌ర్ అండ్ పవ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, నిజాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌నుకునే వ్య‌క్తిగా ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి క‌థ‌ను ముందుకు తీసుకెళ్లింది.

స్టోరీ లైన్‌, ట్విస్టులు, క‌థ‌లోని టెన్ష‌న్‌, అంత‌ర్లీనంగా ఉండే మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేల్యూ, న‌టీన‌టుల పెర్ఫామెన్సులు, సాంకేతిక నిపుణుల ప‌ని తీరు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక చివ‌ర‌లో సెకండ్ సీజ‌న్‌కు ఉంటుంద‌ని లీడ్ కూడా ఇచ్చారు. దీంతో ఆడియెన్స్లో ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత‌గా పెరిగింది. ఆది సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణ, సిరి హన్మంత్‌, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్ర‌తీ పాత్ర‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

షో ర‌న్న‌ర్‌గా, రైట‌ర్‌గా కోన వెంక‌ట్ ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం పులి మేక క‌థ‌ను రాశారు. ఉదాహ‌ర‌ణ‌కు క్లైమాక్స్‌లో ఉండే ముగింపు కోన వెంక‌ట్‌గారి ఆలోచ‌న విధానాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగే వైవిధ్య‌మైన వెబ్ సిరీస్‌గా పులి మేక సాగుతుంది.
న‌టీన‌టులు:

కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, క‌రుణాక‌ర్ శ‌ర్మగా రాజా, ప‌ల్ల‌విగా సిరి హన్మంత్, ఆది సాయికుమార్ అసిస్టెంట్ వెంకట్ పాత్రలో ముక్కు అవినాష్, పాండు రంగారావుగా శ్రీనివాస్, శ్వేతగా స్పందన పల్లి న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె
సినిమాటోగ్ర‌ఫీ: రామ్ కె.మ‌హేష్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టోరి రైట‌ర్స్‌: కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు
కాస్ట్యూమ్స్‌: నీర‌జ కోన‌
పాట‌లు: శ్రీజో
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago