ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బంధీ అనే సినిమా రిలీజ్కు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
సింగిల్ క్యారెక్టర్తో బంధీ అనే చిత్రాన్ని చేశారు ఆదిత్య ఓం. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పేలా ఈ మూవీ ఉండబోతోంది. ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ట్రైలర్ సినిమాలోని డెప్త్ను చాటాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.
నేచురల్ లొకేషన్స్లో ఈ మూవీని షూట్ చేశారు. దేశంలోని వివిద అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు మేకర్లు తీసుకు రానున్నారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…