“ఆదిపురుష్” టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్ కి మీడియాలో అనూహ్య స్పందన.

రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ” ఆదిపురుష్ టీజర్ కోసం ఫాన్స్ లాగే నేనూ చాలా ఆతృతగా ఎదురు చుసాను. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఇదే విషయాన్నీ మా టీం తో చెప్పా కానీ వాళ్ళు నాతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు నేను ఒక్కటే చెప్తున్నాను బాహుబలి సినిమాకి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ అసలు బొమ్మ చూసాకే దాని రేంజ్ అర్ధమవుతుంది ఆ తరువాత టాక్ అదే వెళుతుంది.తనాజీ మూవీ చూసేవరకి ఓం రౌత్ ఎవరో కూడా నాకు తెలీదు కానీ ఆ సినిమా చూసాక అతనికి ఫ్యాన్ అయిపోయాను. ప్రభాస్ ఒక పెద్ద స్టార్. ఈ సినిమా జనవరి 12 న పెద్ద విజయం సాధిస్తుంది.” అన్నారు.”

నిర్మాత భూషణ్ మాట్లాడుతూ, ” మీ రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, ” జై శ్రీరాం, అదొక్కటే మంత్రం ఇక. ఓం, ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేసారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం.” అన్నారు.

అయితే ఆధునాతన సాంకేతికత తో 3డి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రూపొందిన ఈ చిత్ర టీజర్ ని అభిమానుల కోసం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 60-70 థియేటర్లలో ప్రదర్శించనున్నారు .

కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

34 minutes ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

41 minutes ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

50 minutes ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

56 minutes ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

23 hours ago