కేరళ రాయల్ క్లాన్ తో ఆక‌ట్టుకున్న నటి పూనమ్ కౌర్

ఆగ‌స్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన చేనేత కార్మికుల యొక్క కీలక పాత్రను, ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేసే రోజుది. అందులో భాగంగా ఈ ఏడాది న‌టి పూన‌మ్ కౌర్ చేనేత క‌ళ ప‌ట్ల త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేసింది.. ఆమె హృద‌య‌పూర్వ‌క‌మైన క‌థ‌ను తెలియ‌జేసింది.

చేనేత, చేనేత వ‌స్త్రాల‌పై పూన‌మ్ కౌర్ పరిశోధ‌న చేస్తున్నారు. అలాగే న్యాయ‌వాది కూడా అయిన ఆమెకు కేర‌ళ‌లోని ఇద్దరు యువ‌రాణులు క‌లిసే సువ‌ర్ణావ‌కాశం ద‌క్కింది. వారే పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయిలను కలిశారు పూన‌మ్‌.

ఈ సంద‌ర్భంలో కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో తమ అనుభవాలను, అభిరుచిని ఇద్దరు యువరాణిలు తెలియ‌జేశారు. పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి పద్మనాభ స్వామి ఆలయం పట్ల తనకున్న భక్తిని తెలియ‌జేయ‌గా, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయి పూనమ్‌కు అందమైన కేరళ చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.

ఆటోఇమ్యున్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ పూన‌మ్ కౌర్ చేనేత అభివృద్ధిలో భాగంగా చేసున్న ప‌నికి నిబద్ధ‌త‌తో క‌ట్టుబ‌డి ఉన్నారు. అలాగే ఓ కొత్త ప్రాజెక్ట్‌ను చేప‌ట్టాల‌ని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విష‌యం తెలుసుకున్న యువ‌రాణులు దేశంలోని చేనేత కార్మికుల‌కు మంచి భ‌విష్య‌త్త ఉండేలా చూడాల‌ని కోర‌టమే కాకుండా పూన‌మ్ చేయ‌నున్న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ల‌న్నీ విజ‌య‌వంతం కావాల‌ని అభిల‌షించారు.
ఈ అపూర్వ క‌ల‌యిక కాలానికి, సామాజిక హద్దులకు అతీతంగా చేనేతల శాశ్వత సాంస్కృతిక ప్రాముఖ్యతను చేకూర్చేలా క‌నిపిస్తోంది.

నేటి జాతీయ చేనేత దినోత్స‌వం అనేది 1905 నాటి స్వదేశీ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తుంది. భారతీయ తయారీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వట‌మే దీని ప్ర‌ధానోద్ధేశం. ఈ సంవత్సరం జాతీయ చేనేతో దినోత్స‌వ‌ 10 వ వార్షికోత్సవం. భారతదేశం అంతటా వేడుకలు మరియు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో పూనమ్ కౌర్ అంకిత భావంతో ప‌ని చేస్తున్నారు. ఇటీవల రాయల్టీతో ఆమె ఎదుర్కొన్న అనుభవం ఆమె అభిమానులకు మ‌రింత‌ స్ఫూర్తినిచ్చింది.  సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మహిళలు మరియు నేత కార్మికుల సాధికారత కోసం పూన‌మ్  చూపిస్తున్న నిబద్ధతను అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చేనేత ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయంగా తోడ్పాటుని అందిస్తోంది. దీని వ‌ల‌న ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. భిన్నత్వంలో ఏక‌త్వంలా  ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన వైవిధ్యాలల‌ను చేనేత మ‌న‌కు ఆవిష్క‌రిస్తుంది. ఈ వైవిధ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

బనారసి, జమ్దానీ నుంచి బాలుచారి, ఫుల్కారీ వరకు సంక్లిష్టమైన చేనేత ప‌నులు, డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆకర్షణను సంతరించుకున్నాయి. సహజ ఫైబర్స్, సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం స్థిరమైన ఫ్యాషన్స్‌ ప్రోత్సహిస్తుంది, ఇది శతాబ్దాల పురాతన చేనేత వారసత్వాన్ని గౌరవిస్తుంది.

పూనమ్ కౌర్ ఇందులో భాగం కావ‌టంతో చేనేత పరిశ్రమ ఎంత విలువైన‌దో అంద‌రికీ అవ‌గాహ‌న పెరుగుతోంది. ఈ కీలక రంగానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను అంద‌రికీ తెలియ‌జేస్తోంది. ప్రతి చేనేత సృష్టిలో అల్లుకున్న కళాత్మకత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను జాతీయ చేనేత దినోత్సవం గుర్తు చేస్తోంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago