సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచారు. ‘శంబాల’ లాంటి మరో వినూత్నమైన కథాంశంతో వీరంతా కలిసి ఓ ప్రయోగం చేయబోతోన్నారు. యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో మరో సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు.
‘శంబాల’ తరువాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాని నిర్మించాలని వీరంతా కలిసి కథాన్వేషణలో పడ్డారు. ఇక అద్భుతమైన కథ తోడవ్వడంతో వీరంతా కలిసి ముందుకు వచ్చారు. ఎమోషన్స్తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్ను సరికొత్తగా చూపించబోతోన్నారు. భయం, ఉత్కంఠ, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్తో భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీం సిద్దమైంది.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్లో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, ఆకులు, కనిపిస్తున్న పాత కాలం నాటి స్టాంప్ ఇవన్నీ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ కథకి మ్యూజిక్ ప్రాణం అని, సౌండింగ్తోనే సరికొత్త ఎక్స్పీరియెన్స్ అందించాలని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ పాకాలని మ్యూజిక్ డైరెక్టర్గా మళ్లీ తీసుకున్నారు. ఆయన వినూత్నంగా, కొత్తగా సౌండ్-డిజైన్ పద్ధతులతో ప్రయోగాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. బీజీఎంతో ఉద్రిక్తతను పెంచుతూ, భావోద్వేగాలను రేకెత్తిస్తూ, నిశ్శబ్ద క్షణాలలో కూడా ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తామని టీం చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: ఆది సాయికుమార్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ : యుగంధర్ ముని
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నబిమోజు
బ్యానర్ : షైనింగ్ పిక్చర్స్
రచన & దర్శకత్వం : బృందా రవీందర్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్వో : సాయి సతీష్
-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో…
విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…
▪️ తెలుగు, కన్నడ భాషల్లో జూన్లో విడుదలైన చిత్రం▪️ 300 థియేటర్లలో విడుదలై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల…
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…