జూన్ 3న హీరో శర్వానంద్‌, రక్షితా ల వివాహం

Must Read

జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ లో అంగరంగవైభవంగా హీరో శర్వానంద్‌, రక్షితా ల వివాహం

హీరో శర్వానంద్‌, రక్షితా ల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. వివాహ ఆహ్వానం వెలువడింది. ఈ వివాహ వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది.

అదే రోజు జూన్3న జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ లో శర్వానంద్‌, రక్షితా ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది.  

శర్వానంద్‌, రక్షితా ల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.  

ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు అంగరంగవైభవంగా కన్నులపండగగా జరగనున్నాయి.

Latest News

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్...

More News