డ్రామా, డిస్ఫంక్షన్, డ్యామేజ్ – రానా నాయుడు ప్రపంచంలో తన రాకతో అల్లకల్లోలాన్ని రేపిన సునీల్ గ్రోవర్‌

ఒకే వేదికపై బలవంతుడైన రానా నాయుడు, భయంకరమైన జిత్తులమారిలాఆలోచనలు చేసే సునీల్ గ్రోవర్ తలపడుతుంటే… అసలు సిసలైన దుమ్ము దులిపే దృశ్యం మన ముందు ప్రత్యక్షమవుతుంది. దీన్ని ఆవిష్కరిస్తూ ఓ వీడియోను ఎవరి ఉహకు అందని విధంగా నెట్‌ఫ్లిక్స్ సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, సునీల్ గ్రోవర్ ఇద్దరూ కనిపించారు.సీరియస్‌గా, కఠినంగా కనిపించే రానా నాయుడు ప్రపంచంలోకి తనదైన మార్క్ ఉన్మాదంతో ఉన్న సునీల్ ప్రవేశించాడు. ఇతను ఎప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకునే వ్యక్తి కాదు. దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. నిజానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా లేడు.

సునీల్ గ్రోవర్ మాడుతూ, “రానా దగ్గుబాటి మరియు నేను ఒకే ఫ్రేమ్‌లో? నేను కూడా ఊహించలేదు. ‘రానా నాయుడు’ అనేది పవర్ మూవ్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌లతో నిండిన తీవ్రమైన, గట్టి ప్రపంచం. అలాంటి లోకంలో నేను నా స్టైల్ అల్లకల్లోలంతో ప్రవేశించాను. నెట్‌ఫ్లిక్స్ ఈ ఐడియా చెప్పగానే, ఇది ఖచ్చితంగా మైండ్‌బ్లోయింగ్ అనిపించింది. మేము షూట్ చేసినది వైల్డ్, అన్‌ప్రెడిక్టబుల్, అంతెక్కువ ఫన్‌తో కూడినది. అది రెండు వేర్వేరు లోకాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లు అనిపించింది – కానీ ఏదో ఒక విధంగా అది ‘క్లిక్’ అయిపోయింది. ‘రానా నాయుడు’ సీజన్ 2 డ్రామా తీసుకొస్తుంది… అంతేకాదు కొంచెం మాయహెమ్‌ కూడా.”

సునీల్ గ్రోవర్ మాట్లాడుతూ ‘‘నేను, రానా దగ్గుబాటి ఒకే ఫ్రేమ్? దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ‘రానా నాయుడు’ పవర్‌ఫుల్ మలుపులు, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌తో కూడిన తీవ్రమైన, కఠినమైన ప్రపంచం. అలాంటి లోకంలోకి నా ఎంట్రీ అనేది నా స్టైల్లోనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఈ ఐడియా గురించి నాకు చెప్పగానే నాకు అద్భుతంగా అనిపించింది. వైల్డ్, ఎవరూ ఊహించని, ఫన్ కలగలిపిన కథాంశంతో తెరకెక్కించాం. రెండు వేర్వేరు లోకాలు ఢీ కొన్నట్లుగా నాకు అనిపించింది. రానా నాయుడు సీజన్2 కల్లోలంతో కూడా డ్రామాను మీ ముందుకు తీసుకు వస్తుంది. ఇందులో నేను చేసింది అతిథి పాత్ర కాదు. సాధారణంగా మీరు చూసే కలయికలా మాత్రం ఇది కనిపించదు. మిమ్మల్ని నవ్విస్తూనే అసలేం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తూ మరింతగా చూడాలనిపించేలా ఉండే సందర్భం’’ అన్నారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘సునీల్ గ్రోవర్ కనిపించగానే మీరు ఊహించలేని పరిస్థితులను చూస్తామనే భావమనైతే కలుగుుతుంది. రానా నాయుడులా చక్కటి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తాను. పంచ్‌లనే కాదు పంచ్ లైన్‌‌లను కూడా తప్పించుకుంటాను. ఇలాంటి ఓ వైల్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మీకు అందించటానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది. మీరు ఊహించని కల్లోలాన్ని చూడబోతున్నారనైతే నేను కచ్చితంగా చెప్పగలను. మేం సహనటులం కాకపోయినా కొన్ని నిమిషాల పాటు వింతగా ఉండే మా ప్రపంచాలు ఢీ కొంటాయి. అది చూడటానికి హాస్యంతో నిండి ఉంటుంది కూడా. కచ్చితంగా రానా నాయుడు సీజన్2 అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు.

కరణ్ అన్షుమన్ సృష్టించిన రానా నాయుడు సీజన్2ను లోకో మోటివ్ బ్యానర్‌పై సుందర్ అరోన్ నిర్మించారు. ముగ్గురు డైరెక్టర్ల త్రయం – కారణ్ అషుమన్, సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దీన్ని తెరెక్కికెక్కించారు. వెంకటేష్ దగ్గుబాటితో రానా దగ్గుబాటి మళ్లీ రంగప్రవేశం చేశారు. అర్జున్ రాంపాల్, సురవీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చూస్తుంటే డ్రామా, డిస్ఫంక్షన్, డ్యామేజ్ ఈ సీజన్‌లో మరింత ఎక్కువగా కనిపించనున్నాయి.

  • జూన్13 నుంచి రానా నాయుడు సీజన్2ని నెట్ ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

20 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago