క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన ఎడ్యుకేషన్ సిస్టం వల్ల యువత ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టం లేదు. కొన్ని దేశాల్లో పిల్లలకు ప్రకృతి తోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్  తల్లిదండ్రులకు పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. తన సిస్టం లో ఖచ్చితమైన మార్పు రావాలి లేకపోతే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి. 

నా చిత్రం ఒక స్టూడెంట్ కొన్నాం నుంచి ఉంటుంది. స్టూడెంట్స్ పడే బాధలు ఎలా ఉంటాయో చుపించాము. ఈ రోజుల్లో మనకి పలానా దాని గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ ని అడిగితే చెప్పేస్తుంది మరి ఇంకా చదువుని భట్టి పెట్టాల్సిన అవసరం ఏంటి, క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది. ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకేక్కిన్చాము. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు చదువుతో పాటు తన మీద తనకు విశ్వాసం కలిగించాలి కానీ ర్యాంకులు కాదు అనే అంశాన్ని ఈ చిత్రంలో చెప్పాము. మనోజ్ నందన్, చక్రవర్తి, మనీషా మరియు సోనీ రెడ్డి ముఖ్య పాత్రలు చేశారు. ఈ నాలుగు పాత్రలో యూత్ ప్రేక్షకులు తమని తాము చూసుకుంటారు. అందరూ చాలా బాగా చేశారు. మేము కొంత మంది టీచర్ కి స్టూడెంట్ కి మా చిత్రాన్ని చుపించాము, అందరూ సినిమా చాలా బాగుంది అని తెలిపారు. చాలా కాలేజెస్ సినిమా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 28న విడుదల అవుతుంది. 

ఈ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్‌కి ప్రతి స్టూడెంట్‌ కనెక్ట్‌ అవుతాడు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌ చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం కొందరు స్టూడెంట్స్‌తో మాట్లాడటం జరిగింది. మన విద్యావ్యవస్థలోని అంశాలను సీరియస్‌గా చూపిస్తే అంతగా నచ్చకపోవచ్చు. అందుకే అవే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం.చదలవాడ శ్రీనివాస రావు గారితో మరో సినిమా ప్లాన్ లో ఉంది. ప్రస్తుతానికి ట్రాన్స్ జెండర్ వాళ్ళ మీద ఒక సినిమా చేస్తున్న. ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాము” అని తెలిపారు. 

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్

బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్

నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు

కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్

సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.  

కలరింగ్ అమల్

వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ

పి ఆర్ ఓ : పాల్ పవన్

సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు

దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

3 hours ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

3 hours ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

3 hours ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

3 hours ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

1 day ago