‘బిగ్ సి’తో జర్నీ మెమరబుల్. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి బిగ్ కంగ్రాచ్యులేషన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు
”’బిగ్ సి’తో మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి బిగ్ కంగ్రాచ్యులేషన్” అని అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘బిగ్ సి’ 20వ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ వేడుకలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్స్ ని లాంచ్ చేశారు మహేష్ బాబు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి బిగ్ కంగ్రాట్యులేషన్. ఇరవై ఏళ్ళు పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. బిగ్ సి, స్వప్న కుమార్, వారి టీంకు అభినందనలు. గత రెండేళ్ళుగా వారితో నా అసోషియేషన్ వుంది. ఇది మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. వారితో అసోషియేషన్ కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బిగ్ సి ఫౌండర్, సిఎండీ యం. బాలు చౌదరి మాట్లాడుతూ… మహేష్ బాబు గారు ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. మీ అందరికీ తెలుసు.. గత రెండు దశాబ్దాలు గా బిగ్ సి నెంబర్ వన్ స్థానంలో వుంది. నెంబర్ వన్ అంటే స్టోర్స్, రెవెన్యూ లోనే కాదు.. కస్టమర్స్ అవసరాలని, ప్రాధాన్యతని తెలుసుకొని వారిని ఆనంద పరచడంలో బిగ్ సి విశేష సేవలని అందిస్తోంది. కస్టమర్స్ కు మేము కృతజ్ఞులై వుంటాం. గత ఆర్ధిక సంవత్సరానికి బిగ్ సి టర్నోవర్ 1000 కోట్లు వుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 1500 కోట్లు టర్నోవర్ సాధించే దిశగా పనిచేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ తమిళ నాడులో 250 స్టోర్స్ వున్నాయి. మరో రెండేళ్ళలో 150 స్టోర్స్ ని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మేము మొదలుపెట్టినప్పుడు మొబైల్ ఫోన్ డిస్ ప్లే అనే కాన్సెప్ట్ వుండేది కాదు. అక్కడి నుంచి కస్టమర్స్ ప్రాధాన్యత అవసరాలు గుర్తించి, కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకొని సేవలు అందించడం జరుగుతోంది. ఈ దశాబ్దంలో కూడా అదే అంకిత భావంతో కస్టమర్స్ కి సేవలు అందిస్తాం. ఈ విజయం కస్టమర్స్ నమ్మకం, అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైయింది’’ అన్నారు.
బిగ్ సి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్వప్నకుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు మహేష్ బాబు గారు రావడం చాలా ఆనందంగా వుంది. బిగ్ సి రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసింది. ఇది మాకు మెమరబుల్ మూమెంట్. ఈ జర్నీలో వినయంగా చెప్పుకునే విషయం ఏమిటంటే.. ఈ ఇరవై ఏళ్లలో మార్కెట్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం. కస్టమర్స్ బిగ్ సి బ్రాండ్ పై పెట్టుకున్న నమ్మకం, ప్రోత్సాహం వలనే ఇది సాధ్యపడింది.’’ అన్నారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మహేష్ బాబు.
బ్రాండ్ అంబాసిడర్గా చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో చాలా సేవకార్యక్రమాలు చేస్తున్నారు కదా.. దీనికి స్ఫూర్తి ఎలా వస్తోంది ?
సేవ చేయాలనే స్ఫూర్తి చిన్నప్పటినుంచి వుంది. గౌతమ్ పుట్టిన తర్వాత ఎంబీ ఫౌండేషన్ కి శ్రీకారం చుట్టాం. చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా. అలాగే రీ-రిలీజ్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే ఇస్తున్నా. ఈ విషయంలో నాకు చాలా తృప్తి వుంది.
మహేష్ గారు.. స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు ?
మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను( నవ్వుతూ).
మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ?
నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి( నవ్వుతూ)
మీరు అంబాసిడర్ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా ?
బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను.
మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది ?
చాలా ఉంటాయండి.
ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ?
నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు (నవ్వుతూ)
మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ?
నాది సైలెంట్ టోన్ (నవ్వుతూ).
మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ?
నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…