శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ రెండో చిత్రంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Must Read

శ్రీ పాద క్రియేషన్స్ పతకం పై జగదీష్ కె కె దర్శకత్వంలో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు జూన్ 9న తెలియజేయుచున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ కిషన్ గారు మాట్లాడుతూ 2021 లో మా మొదటి సినిమా “కనబడుటలేదు” విడుదలై మూడు సంవత్సరాలు అయ్యింది, ఆ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు నా మిత్రులు డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ తో కలిసి మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాము. మంచి కథ, కథనం తో మా చిత్రాని నిర్మిస్తున్నాము.

2022 లో చింతపల్లి అడవులు మరియు లంబసింగి లోని అందమైన లొకేషన్స్ లో అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ మాసల్లో చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలలో మా చిత్రాని చిత్రికరించము.

సంగీత దర్శకుడు వంశీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మా చిత్రానికి ఊపిరి పోసింది. పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి, రాహుల్ సిప్లిగంజ్, శాండీలియ మరియు హరి చరణ్ పాటలు హై లైట్ గా నిలుస్తాయి. సినిమా చాలా బాగా వస్తుంది, ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు

బ్యానర్ – శ్రీ పాద క్రియేషన్స్

ప్రెసెంటర్ – సరయు తలశిల

దర్శకుడు – జగదీష్ కె కె

నిర్మాతలు – డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్

మాటలు – అరుణ్ వీర్
సినిమాటోగ్రఫీ – వి ఆర్ కె నాయుడు
ఎడిటర్ – జగదీష్ కె కె
ఆర్ట్ డైరెక్టర్ – బత్తుల శివ సాయి కుమార్
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీను ఇర్ల
కొరియోగ్రాఫర్ – ఆది పొన్నస్
లిరిక్స్ – శ్రీమని, ధర్మ గూడూరు
కాస్ట్యూమ్స్ – రేణు కియార
సౌండ్ ఇంజనీర్ – రాధా కృష్ణ

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News