“భజే వాయు వేగం” సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “భజే వాయు వేగం” సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లోని యూవీ ఆఫీస్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరో కార్తికేయ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పడం లేదు. సాధారణంగా సినిమాలో ఫలానా ఎలిమెంట్ బాగుందని చెబుతారు. కానీ “భజే వాయు వేగం” సినిమా చూసినవాళ్లు కంప్లీట్ మూవీ నచ్చిందని అంటున్నారు. ఈ రేంజ్ సినిమా ఇంత ఎమోషనల్ గా తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందడం హ్యపీగా ఉంది. ఆర్ఎక్స్ 100 కంటే ఎక్కువ ఎమోషన్ ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది. మేము కథను నమ్మి ఎలాంటి మూవీ చేయాలనుకున్నామో, అలాంటి మూవీ చేశాం. సక్సెస్ కూడా మేము ఆశించినట్లే దక్కింది. “భజే వాయు వేగం” సినిమా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని నా నెక్ట్ మూవీస్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమాతో ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణను, నా సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నా తదుపరి సినిమాలు చేస్తూ పనిచేస్తాను. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ – నిన్న మా క్లోజ్ సర్కిల్, ఫ్యామిలీ మెంబర్స్ కు షో వేశాం. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాలో కొంత ఒత్తిడి తగ్గింది. ఇందాకే సంధ్య థియేటర్ లో మూవీ చూసి వచ్చాను. థియేటర్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక మాకెంతో హ్యాపీ ఫీలింగ్ కలిగింది. సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని, సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉందని చెబుతున్నారు.
మేము ప్రేక్షకుల్ని గౌరవించి, వాళ్లకు నచ్చే ఎమోషన్స్ తో సినిమా రూపొందించాం. ప్రేక్షకులు మాకు తిరిగి రెట్టింపు గౌరవాన్ని ప్రేమను అందిస్తున్నారు. థ్యాంక్యూ. టాక్ బాగుందని వచ్చింది కాబట్టి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి థియేటర్ లో చూడండి. అన్నారు.

యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాను ఈ రోజు మొదటిసారి థియేటర్ లో చూశా. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు 15 ఏళ్ల తర్వాత ఒక హిట్ సినిమా దక్కింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను కార్తికేయ నమ్మకంతో వర్క్ చేశాం. ఇందులోని ఎమోషన్స్ అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. యూవీ బ్యానర్ కు థ్యాంక్స్. డైరెక్టర్ ప్రశాంత్ నేనొక హిట్ మూవీతో తిరిగొచ్చేలా చేశాడు. కార్తికేయతో ఈ మూవీ చేస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఈ రోజు స్క్రీన్ మీద చూస్తుంటే నటుడిగా అతని పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా నుంచి కార్తికేయ నటుడిగా మరింత హైట్స్ చూడాలని కోరుకుంటున్నా. “భజే వాయు వేగం” సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన కపిల్ కుమార్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా హిట్ అవుతుందని మేము ముందే ఊహించాం. ఈ సినిమా కోసం అప్రోచ్ అయిన 30 నిమిషాలకే నాకు అవకాశం ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ, రాహుల్, రవిశంకర్, తనికెళ్ల భరణి గారు చేసిన మంచి పర్ ఫార్మెన్స్ వల్లే బీజీఎం బాగా కుదిరింది. నా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చిన ప్రశాంత్, యూవీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago