బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ రోజు అతిరధ మహారధుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్ ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కి సందీప్ డైరెక్షన్ చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ “అందరికి నమస్కారమండి, ఈ పూజా కార్యక్రమం కొచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు హరీష్ ఇది నా మొదటి సినిమా. కథ చెప్పగానే నిర్మాత వెంటనే మొదలుపెడదాం అన్నారు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఈ కథ ఒప్పుకున్నందుకు మా హీరో దీపక్ , హీరోయిన్ అనైరా ఇద్దరికీ థాంక్స్ చెబుతున్నాను. ఇక్కడికి వచ్చిన గెస్టులు వేణు గారికి, వంశీ గారికి, సందీప్ సుజిత్ గార్లకు, ప్రదీప్ గారికి చాలా థాంక్స్. ఇది కంప్లీట్ లవ్ జానర్ సినిమా. రొమాంటిక్ కాల్ టు లవ్ స్టోరీ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. జనవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ లో ముగించాలని ప్లాన్ చేస్తున్నాము. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ చాలా థాంక్స్” ఉన్నారు.

హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ ” గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నాన్నోయ్ రైలు తెమ్మన్నాను తెచ్చావా? అన్న ఆ అబ్బాయిని నేనే. సిద్ధార్థ రాయ్ సినిమాకి మంచి రిసెప్షన్ ఇచ్చారు.. నా పేరు దీపక్ సరోజ్.నాన్న రైలు డైలాగు ఎప్పుడూ ఎందుకు చెబుతానంటే.. నేను ఆ డైలాగ్ ద్వారానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాను. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ గారు ఒక మంచి ప్రేమ కథతో వస్తున్నారు. నేను మంచి కథ కోసం చూస్తున్నప్పుడు ఈ కథ విన్నాను నేను కచ్చితంగా చెప్పాల్సిన కథ అనిపించింది. టీం కూడా చాలా మంచి టీం అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ గారు ఇప్పటివరకు ఎంత మంచి సంగీతం ఇచ్చారో మనకు తెలుసు. ఆయన నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం. మా నిర్మాత హరిబాబు గారు ఇది మొదటి సినిమానే అయినా ఆయన చాలా కాలం ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది. సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైన నిర్మాతలతో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ సురేష్ గారు ఎడిటర్ వరప్రసాద్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మంచి టీం సెట్ అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన అతిథులకు మీడియా వారికి చాలా థాంక్స్. మా పిఆర్ఓ శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ అనైరా మాట్లాడుతూ అందరికీ నమస్కారం “ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎంతో సంతోషంగా, ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శక నిర్మాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక బయట వ్యక్తికి సినిమా అవకాశం రావడం మామూలు విషయం కాదు. కానీ వారు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఎందుకంటే కెమెరా ముందు కనపడటం అనేది నాకు చిరకాల కోరిక. చిన్నప్పటినుంచి నాకు కెమెరా అన్నా సినిమా అన్నా చాలా ఇష్టం. సినిమా అంటే నాకు ఒక రకమైన పిచ్చి, సినిమా అంటే పడి చచ్చిపోతాను నాకు సినిమా అంటే అంత ఇష్టం. దీపక్ గారితో కలిసి పనిచేయటానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మేము మా బెస్ట్ టీంతో ఎంటర్టైనింగ్ ధమాకా ప్యాకేజ్ సినిమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము” అన్నారు.

నిర్మాత హరిబాబు మాట్లాడుతూ అందరికీ పేరుపేరునా నమస్కారం నా పేరు హరిబాబు. నేను 20 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో లక్ష్మీనరసింహ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాను. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. వెంటనే హరీష్ గారి కథకు ఓకే చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకే సినీ నిర్మాతగా మారాను. మా సినిమాకు సంగీతం అందించడానికి ముందుకొచ్చిన అనూప్, సినిమాటోగ్రఫీ అందిస్తున్న సురేష్ గారికి ధన్యవాదాలు. హీరో గారికి కథ చెప్పగానే మంచిగా ఉందని ఓకే చేశారు, వారికి ధన్యవాదాలు. హీరోయిన్ కూడా కథ విన్న వెంటనే ఓకే చేశారు. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన దర్శకులు, ఇతర మిత్రులు, మీడియా వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు” అని ఆయన అన్నారు.

తారాగణం: దీపక్ సరోజ్, దీక్షిక, అనైరా, రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు , రచ్చ రవి తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ గద గాని
బ్యానర్: శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: తన్నీరు హరిబాబు
సంగీతం: అనూప్ రూబెన్స్
డీవోపీ: సురేష్ రగుతు
ఎడిటర్: ప్రసాద్
కో డైరెక్టర్: అనిల్ బోయిడాపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అర్జున్ సాయి
యాక్షన్ డైరెక్టర్: మదికొండ నటరాజ్
పీఆర్వో: బిఏ రాజు’స్ టీం
బి శివ కుమార్ – మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago