“గం..గం..గణేశా” మంచి యాక్షన్ కామెడీ మూవీ – నిర్మాత వంశీ కారుమంచి

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “గం..గం..గణేశా” సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించిన “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, నిర్మాతగా తన అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి.

  • మాది గుంటూరు. యూఎస్ వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. లాక్ డౌన్ టైమ్ లో ఇండియాకు వచ్చాము. లాక్ డౌన్ వల్ల యూఎస్ వెళ్లలేకపోయా. చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్లడం అలవాటు. బాలకృష్ణ అభిమానిని. అమెరికా వెళ్లాక కూడా అక్కడ మన తెలుగు సినిమాలన్నీ చూసేవాళ్లం. మేము పేపర్స్ విసిరేస్తూ థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేయడం అక్కడి వాళ్లకు కొత్తగా అనిపించేది. యూఎస్ లో ఇంకొన్నేళ్లు ఉండి ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నాం. అప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉండేది. అయితే లాక్ డౌన్ లో ఇక్కడే ఆగిపోవడం వల్ల ఆనంద్ తో సినిమా బిగిన్ చేశాం. ఆనంద్, విజయ్ నాకు మంచి మిత్రులు.
  • దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పినప్పుడు ఆనంద్ కు బాగుంటుంది అనిపించింది. అయితే ఆనంద్ ఇలాంటి కథ చేస్తాడా లేదా అనే సందేహం ఉండేది. కథ విన్నాక ఆనంద్ కూడా తనకు కొత్తగా ఉంటుందని భావించి మూవీకి ఓకే చెప్పాడు. ఆనంద్ ఈ సినిమాలో ఫంకీ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర ఇది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా గం గం గణేశా. వినాయక చవితికే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా..అప్పుడు కొన్ని స్ట్రైక్స్ జరగడం, ఆనంద్ బేబి మూవీ మేకోవర్ లో ఉండిపోవడంతో గం గం గణేశాను పోస్ట్ పోన్ చేశాం. ఈ నెల 25న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా..ఆ రోజు దిల్ రాజు గారి లవ్ మీ రిలీజ్ చేశారు. సో 31 డేట్ మా మూవీ రిలీజ్ కు పర్పెక్ట్ అనుకుంటున్నాం.
  • గం గం గణేశా సినిమా నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 400కు పైగా థియేటర్స్ దొరికాయి. నెంబర్ పరంగా మంచి రిలీజ్ అని భావిస్తున్నాం. అమోజాన్ ప్రైమ్ తో ఓటీటీ డీల్ చేసుకున్నాం.
  • గం గం గణేశా సినిమా ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. ఆయన బేబి సినిమాతో దీన్ని పోల్చవద్దు. అది లవ్ ఎమోషనల్ మూవీ. ఇది క్రైమ్ కామెడీ యాక్షన్ సినిమా. ముఖ్యంగా కామెడీ ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నవ్విస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ ఫార్మెన్స్ చేశారు. వీళ్లిద్దరి పాత్రలకు స్కోప్ ఉంటుంది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మేమీ సినిమాను రిలీజ్ కు తీసుకురావడం అడ్వాంటేజ్ అయ్యింది.
  • క్రైమ్ కామెడీ జానర్ లో కథలు చెప్పినంత బాగా దర్శకులు తీయలేరు. కానీ గం గం గణేశాను కథ నెరేషన్ కంటే బాగా తెరకెక్కించాడు ఉదయ్. కొంత బడ్జెట్ ఎక్కువైంది. అయితే సినిమాలో ఆ క్వాలిటీ తెలుస్తుంటుంది. మా సర్కిల్ లో సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పారు.
  • ఇతర ఇండస్ట్రీస్ తో పోల్చితే సినిమా ఇండస్ట్రీ క్లిష్టమైంది. చూసేందుకు చిన్న ఇండస్ట్రీ అయినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఐటీ సెక్టార్ లో కనీసం 15 పర్సెంట్ వర్క్ సినిమా ఇండస్ట్రీ నుంచే వస్తోంది. ఏ బిజినెస్ అయినా రిస్క్ చేయాల్సిందే. లైఫ్ లో రిస్క్ లేనిదే ఏదీ సాధించలేదు. సినిమా ప్రొడక్షన్ లోనూ రిస్క్ ఉంది.
  • గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రశ్మిక అతిథిగా రావడం సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన కేదార్ నాకు స్నేహితుడు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో ఆ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. నా అభిమాన నటుడు బాలకృష్ణతో సినిమా నిర్మించే అవకాశం వస్తే అదొక వరంలా భావిస్తా. ఈ వారం మాతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలకు వస్తున్నాయి. కాంపిటేషన్ ఉంది. అయితే అది హెల్దీ కాంపిటేషన్ గానే భావిస్తున్నాం.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

19 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago