ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన “గం..గం..గణేశా” సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – మా “గం..గం..గణేశా” సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాము. మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ కు ఊగిపోతూ నవ్వుతున్నారు. ఫ్యామిలీస్ తో మీడియా మిత్రులు వచ్చి సినిమా చూశారు. మా దర్శకుడు ఉదయ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా రూపొందించారు. అన్ని మేజర్ క్యారెక్టర్స్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మా మూవీతో పాటు రిలీజైన మరో రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం సంతోషకరం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మరోసారి “గం..గం..గణేశా” చూసేందుకు వెళ్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాకు థియేటర్స్ లో క్లాప్స్, విజిల్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, చెక్ పోస్ట్ సీన్, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిషోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్ క్యారెక్ట్ కు కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. మా “గం..గం..గణేశా” సినిమాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఆర్గాన్ డేవిడ్, ఇమ్మాన్యుయేల్ చేసిన శంకర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఆనంద్ కు కూడా కొత్త తరహా సినిమా ఇదని రివ్యూస్ వస్తున్నాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మంచి బీజీఎం ఇచ్చారు. నెక్ట్ మూవీ కూడా ఆయనతోనే చేస్తాం. అన్నారు.
యాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ – “గం..గం..గణేశా”తో మా ఉదయ్ గారు ఫస్ట్ మూవీనే హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆనంద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆయన పర్ ఫార్మెన్స్ అదిరిపోయింది. మా చిత్రానికి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్నారు.
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆనంద్ అన్న నేను అనుకున్నాం ఈ సినిమాకు కామెడీ వర్కవుట్ అయి ఫ్యామిలీస్ వస్తే మనం సక్సెస్ కొట్టినట్లే అని. ఈ రోజు ఆ మాట నిజమైంది. మా “గం..గం..గణేశా” సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. ఈ చిత్రంతో నా పేరు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నుంచి వెస్టిండీస్ గా మారిందని అంటున్నారు. నెక్ట్ టు డేస్ వీకెండ్ కాబట్టి మా మూవీ థియేటర్స్ కు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ వస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్, సపోర్ట్ కు థ్యాంక్స్. ఇటీవల కాలంలో మనకు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రాలేదు. “గం..గం..గణేశా” పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. ఫస్ట్ మూవీతోనే మా డైరెక్టర్ హిట్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ ప్రాజెక్ట్ బాగా వచ్చేందుకు పూర్తి సపోర్ట్ అందించారు. ఈ రోజు రిలీజ్ కాబట్టి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసు. ముందు ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా. “గం..గం..గణేశా”లో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్, యావర్..ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగా వచ్చాయి. ఒక మిస్టికల్ ఎలిమెంట్ కూడా గణేశుడి గురించి ఉంది. అన్నయ్య విజయ్ ఈ సినిమాను రిలీజ్ కు ముందే చూసి బాగుందని చెప్పారు. ఈ వీకెండ్ మా సినిమాకు ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లండి. ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…