నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వాతియర్ గా, సూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం “విడుతలై”. ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
మొదలు పెట్టినప్పటి నుండి అనూహ్యమైన స్పందన ని అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కడం దీనిని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై సమర్పించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందం తో విడుతలై మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రెండో భాగంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలున్నాయి. ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ పరిశ్రమలో ఇప్పటివరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. కళా దర్శకుడు జాకి నేతృత్వంలోని కళా బృందం 10 కోట్ల విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించగా ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యం లో భారీ సెట్ ని నిర్మించారు. ప్రస్తుతం యాక్షన్ కోరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకనాల్ లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడు కి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం పాల్గొనున్నారు.”
విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సంగీతం మేస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఇస్తుండగా సినిమాటోగ్రఫీ వెల్ రాజ్ చూస్కుంటున్నారు.
భారీ అంచనాల మధ్య తెలుగు – తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ‘విడుతలై పార్ట్ 1’ & ‘విడుతలై పార్ట్ 2’ విడుదల తేదీని నిర్మాతలు అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…