ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ సమర్పణలో సాయి విలా సినిమాస్ పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి దర్శకుడు బి. గోపాల్ గారు క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు..దర్శకుడు రేలంగి నరసింహారావు గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు : అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ. అయితే రాజమౌళి గారు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ లో మిగిల్చి ఇవ్వడం అలవాటు. నేను అదే ఫాలో అవుతున్నాను.. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు. నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తెరకేక్కించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.
చిత్ర నిర్మాతలు లక్ష్మణ్ రావు., శ్రీనివాస్ లు మాట్లాడుతూ ...మా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమాను ప్రారంభించు కోవాలనుకొని ఈ రోజు సినిమా మొదలు పెట్టాము. మా మొదటి సినిమా రుద్రవీణ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో మా రెండవ ప్రాజెక్టు గా ప్రొడక్షన్ నెంబర్ 2 లో ఈ సినిమా తీస్తున్నాము. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాము మంచి కథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పు పొందేలా ఉంటుంది అన్నారు.
హీరో కృష్ణ మాట్లాడుతూ.. నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహరవు గారి వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలుపుకుంటున్నాను అన్నారు
కమెడియన్ గౌతం రాజు మాట్లాడుతూ.. ,మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత లక్ష్మణ్ డేరింగ్ పర్సన్. తన మెదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా మొదలుపెట్టాడు. దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు గారు మాట్లాడుతూ..
గౌతం రాజు గారు తన కొడుకుకు కృష్ణ అనే మంచి పేరు పెట్టాడు. హీరో కృష్ణ మంచి సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ అంతటి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
నిర్మాత రామ సత్య నారాయణ.గౌతం రాజు కొడుకు కృష్ణ చేస్తున్న ఈ సినిమా ఐదవ సినిమా.ఇలాగే మంచి సినిమాలు తీస్తూ మంచి నటుడుగా ఎదుగుతూ ఫ్యూచర్ లో కృష్ణ తండ్రి గౌతం రాజు అనే స్థాయికి ఎడుగుతాడనే నమ్మకం ఉందని అన్నారు.చక్కని కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు వస్తుంది అన్నారు.
నటుడు డి ఎస్ రావు మాట్లాడుతూ ,.. కమెడీయన్ గా మంచి పేరు తెచ్చుకున్న గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. హీరో హీరోయిన్ ల జోడీ బాగుంది.నిర్మాత అనుకున్న బడ్జెట్ లో దర్శకుడు సినిమా తియలనీ అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు
ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీ నటులు
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : రావుల గౌరమ్మ
బ్యానర్: సాయి విలా
నిర్మాతలు : రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను
స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అంజన్ చెరుకూరి
DOP: ఎస్. రాజశేఖర్
సంగీతం: త్రినాథ్ మంతెన
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీ రాములు
పి ఆర్. ఓ : టి. యస్. యన్. మూర్తి
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…