లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్ బాల. తాజాగా మెగా ఫిలిమ్స్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈషా చావ్లా హీరోయిన్. ఈ నెల 17 న రాజ్ బాల పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..
మాది ప్రకాశం జిల్లా గిద్దరూరు యడవల్లి గ్రామం మా నాన్న ఆర్ టి సి కండక్టర్ నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం. నా డిగ్రీ అనంతరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నం చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ కరుణాకరన్ గారు “ఎందుకంటే ప్రేమంటే” సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు.ఆ తరువాత తొంగి తొంగి చూడమాకు చందమామ”, “అంతకుమించి” వంటి సినిమాలు చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ నగేష్ నారాదాసి గారు “లవ్ బూమ్” సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా తరువాత విజయ్ శేఖర్ సంక్రాంత్రి దర్శకత్వంలో నేను హీరోగా చేసిన “7 to 4” సినిమాబిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అడ్వాన్స్ కథ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుండి నాకు మంచి గుర్తింపు లభించింది.ఇప్పట్లో రిలీజ్ అయితే ఇప్పటి ఓటిటి ట్రెండ్ కు కరెక్ట్ సెట్ అయ్యేది .అలాగే కరోనా టైమ్ లో రిలీజ్ అయిన రమేష్ విభూది డైరెక్షన్ లో వచ్చిన “చిత్రం X” సినిమా కూడా నాకు చాలా మంచి గుర్తింపు లభించింది.
ఈ పది సంవత్సరాలు జర్నీ లో నేను ఆర్టిస్ట్ గా, నటుడుగా, హీరోగా ఇలా ఎన్నో ఒడి దుడుకులు ఎదురైనా నేను చేసే ప్రతి పనికి,సినిమాకు ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుకు వెళితే ఫలితం దానంతటదే వస్తుంది అనేదే నా కాన్సెప్ట్. ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని ఒక మారు మూల గ్రామం నుంచి వచ్చి ఇన్ని సినిమాలలో హీరోగా చేయగలిగే స్థాయికి వచ్చాను అంటే నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను.
ప్రస్తుతం నేను మెగా ఫిలిమ్స్ పతాకంపై కమలాకరరావు ,కిషోర్ నిర్మాతలుగా జాక్ దర్శకత్వంలో హీరో చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది నాకు మంచి ప్రాజెక్టు అవుతుంది.ఈ సినిమా 40% షూటింగ్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుంది.ఇందులో కాలకేయ ప్రభాకర్ విలన్ గా,. ఈషా చావ్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ క్యారెక్టర్ లో సినిమా మొత్తం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ లా సాగుతున్న ఈ సినిమా ఇప్పుడొస్తున్న సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కంప్లీట్ గా ఈషా చావ్లా , నామీద, కాలకేయ ప్రభాకర్ ల మీద ఈ కథ సాగుతుంది. ఇందులో విలన్ గా కాలకేయ ప్రభాకర్ చేస్తున్నాడు. హీరోయిన్ ఈషా చావ్లా గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తను చేసిన సినిమాలన్నీ హిట్ సాధించాయి.అలాగే మంచి కథతో వస్తున్న ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.
ప్రస్తుతం సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో కాలేజ్ లో నెగిటివ్ రోల్ చేశాను ఈ సినిమా నాకు మంచి ఐడెంటిటీ వస్తుంది.. కన్నడలో “ననిగే ఎంతి బేకు”,తెలుగులో “నాకు పెళ్ళాం కావాలి” వంటి బై లింగ్వేల్ సినిమా చేస్తున్నాను.మరో సినిమా “బృహన్నల” .తెలుగు, హిందీ తమిళ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు “రా” టైటిల్ పెట్టారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…