ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘అల్లూరి’ అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినట్లే చాలా సీనియర్స్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయం చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుంటుంది. చాలా మంచి మనిషి. ఈ సినిమా చూసిన వాళ్ళు మీ అనుభవాన్ని స్నేహితులకి చెప్పండి. మీడియా, వంశీ-శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా పెద్ద సినిమా చేయాలి” అని కోరారు.
ప్రదీప్ వర్మ మాట్లాడుతూ.. నేను అనుకున్న కథ రాశాను, డైరెక్ట్ చేశాను, రిలీజ్ చేశాం. నా కల నెరవేరింది. నేను విజయసాధించాననే ఆనందం వుంది. శ్రీవిష్ణు అద్భుతంగా చేశారు. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చేశారు. విజువల్స్ ఇంత రిచ్ గా ఉండటానికి కారణం నిర్మాత ఇచ్చిన సపోర్ట్. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామకృష్ణ బ్రిలియంట్ గా యాక్షన్ డిజైన్ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీంకి కృతజ్ఞతలు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా బావుందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ పని మీడియా మాత్రమే చేయగలదు. దయచేసి మీడియా సినిమాని మరింత జనాల్లోకి తీసుకెళ్ళాలి” అని కోరారు
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. .. ‘అల్లూరి’ నిన్న మాట్నీ షో నుండి అన్ని చోట్ల రిలీజ్ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో పడలేదు. మాట్నీ షో నుండి క్రమంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరూ స్ఫూర్తిని ఇచ్చే చిత్రమని అభినందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు. ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తారని కోరుతున్నాను. ఫ్యామిలీ తో కలసి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. శ్రీవిష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా చక్కగా తీశారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ అందించారు. మిగతా సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మంచి సినిమా తీశాం. మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని మరింతగా ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు.
ఈ సక్సెస్ మీట్ లో డీవోపీ రాజ్ తోట, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్, ఫైట్ మాష్టర్ రామ్ క్రిషన్, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు పాల్గొని సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…