చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా ‘కోబ్రా’ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
”హి ఈజ్ ఏ కోబ్రా. రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్ళడం తెలుసు. చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు.” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్.. హైవోల్టేజ్ యాక్షన్, విక్రమ్ రకరకాల అవతారాలు, నట విశ్వరూపంతో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. తన జీవితంలోని ప్రతి ఒక్క సెకను అంకెలను పీల్చుకునే, ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొని, దేశ విదేశాలు తిరుగుతూ, గణితశాస్త్రన్ని వుపయోగించి నేరాలు పాల్పడిన మేధావి కోబ్రా పాత్రలో విక్రమ్ పెర్ఫార్మమెన్స్ బ్రిలియంట్ గా వుంది.
ఈ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతుచిక్కని కోబ్రా కోసం వేటలో ఉన్న పోలీసుగా కనిపించారు. శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రేయసిగా కనిపించగా, రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు.
విక్రమ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పాటు వైబ్రెంట్ విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ చిత్రానికి బిగ అసెట్స్ గా నిలిచాయి. ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. హరీష్ కన్నన్ కెమెరా పనితనం రిచ్ గా వుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 31న విడుదలౌతుంది.
తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
విడుదల: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ-శేఖర్
హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
▪️ భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘తీరం’ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న…
-ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే నేను" సినిమా ఇటీవల ప్రకటించిన…
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)”…