నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
సుధీర్ బాబు మాట్లాడుతూ..’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తండ్రి కూతుళ్ళు కలసి సినిమాకి వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పరిణితి వస్తుంది. ఈ సినిమాకి మరిన్ని ప్రశంసలు వస్తాయని బలంగా నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా మీడియా మరింత సపోర్ట్ చేయాలి. ఇంద్రగంటి గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంది. ఈ సినిమా చూసిన తర్వాత కృతిశెట్టి నా ఫేవరేట్ స్టార్ అయ్యారు. మా నిర్మాతలు గర్వంగ చెప్పుకునే సినిమా నిర్మించారు. వారికి ఆల్ ది బెస్ట్. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలి. పీజీ విందా, సాహి సురేష్, మార్తాండ్ కే వెంకటేష్, వివేక్ సాగర్ తో పని చేయడం ఆనందంగా వుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అందరూ తప్పక చూడాల్సిన వర్త్ వాచింగ్ మూవీ” అన్నారు
కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. సుధీర్ బాబు గారు లాంటి మంచి యాక్టర్ తో నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి” అని కోరారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కి హార్ట్ వార్మింగ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు ఒక కొత్త కోణాన్ని ప్రజంట్ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలనే కోరిక వుంది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరింత ఎక్కువ మంది ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. సుధీర్ బాబు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని సినిమా చుసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మేము నమ్మిన అంశాలపై పట్ల విమర్శకులు కూడా ఏకీభవించడం మాకు ఆనందం కలిగించింది. కృతిశెట్టి చాలా కొత్తగా కనిపిస్తున్నారనే ప్రశంసలు వస్తున్నాయి. పీజీ విందా, సాహి సురేష్, వివేక్ సాగర్ ఇలా సాంకేతిక నిపుణులందరి వర్క్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మాకు సహకరించిన మీడియాకి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ కృతజ్ఞతలు. గొప్ప ఆత్మగౌరవంతో అరంగేట్రం చేసిన బెంచ్ మార్క్ స్టూడియోకి అభినందనలు. ఈ మంచి సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షకులు, మీడియాని కోరుతున్నాను”
సాహి సురేష్ మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వైబ్ తో ముందుకు వెళుతుంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి, కృతిశెట్టి , సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.
శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు మలయమారుతం లాంటి సినిమా తీశారు. ఈ సినిమాని విజయవంతం చేయాల్సిన భాద్యత మనం తీసుకోవాలి. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి” అని కోరారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…